యాప్నగరం

పెళ్లయిన ఏడేళ్లకు గర్భం.. మరో 15 రోజుల్లో కవలలకు డెలివరీ.. ఇంతలో భర్తకు ఊహించని విషాదం

విధి ఎవర్ని ఎలా వెంటాడుతుందో ఎవరం.. ఏమీ చెప్పలేము. నిండు గర్భిణి అయిన భార్య ఇంకో పదిహేను రోజుల్లో కవల పిల్లలకు జన్మనిస్తుందన్న ఆనందం ఒకవైపు.. ఆ రోజే ఆమె పుట్టినరోజు భర్త ఎంతో సంతోషంగా ఉన్నాడు. అదే రోజు పని దొరకడంతో ఆ డబ్బుతో సాయంత్రం.. తన భార్యను ఆనందంగా ఉంచాలని కోరికతో వెళ్లిన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.

Edited byరావు | Samayam Telugu 13 Aug 2022, 8:27 am

ప్రధానాంశాలు:

  • భార్య పుట్టినరోజునే ప్రమాదవశాత్తు భర్త మృతి
  • పెళ్లయిన ఏడేళ్లకు గర్భం.. 15 రోజుల్లో డెలివరీ అనగా ఘటన
  • ఆదిలాబాద్ జిల్లా చాందా గ్రామంలో విషాద ఛాయలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pregnant woman
ప్రతీకాత్మక చిత్రం
విధి ఎవర్ని ఎలా వెంటాడుతుందో ఎవరం.. ఏమీ చెప్పలేము. నిండు గర్భిణి అయిన భార్య ఇంకో పదిహేను రోజుల్లో కవల పిల్లలకు జన్మనిస్తుందన్న ఆనందం ఒకవైపు.. ఆ రోజే ఆమె పుట్టినరోజు భర్త ఎంతో సంతోషంగా ఉన్నాడు. అదే రోజు పని దొరకడంతో ఆ డబ్బుతో సాయంత్రం.. తన భార్యను ఆనందంగా ఉంచాలని కోరికతో వెళ్లిన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.
ఆదిలాబాద్ జిల్లాలోని చాందా గ్రామానికి చెందిన పంచాయతీ వార్డు సభ్యుడైన బండారి సాయికిరణ్ (28) వేడుకలు లైటింగ్ వర్క్, డెకరేషన్ పని చేస్తుంటాడు. ఆదిలాబాద్‌లోని సప్తగిరి కాలనీలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో డెకరేషన్ చేయాలని చెప్పడంతో సాయికిరణ్ అక్కడికి వెళ్లాడు. స్టేజీ నిర్మాణాలు, అలంకరణ చేయడానికి అవసరమైన ఇనుప ఫ్రేమ్‌ను మొదటి అంతస్తుకు తరలించే సమయంలో.. పైనున్న 11కేవీ తీగల ద్వారా విద్యుత్ సరఫరా అవడంతో.. సాయికిరణ్ విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చుట్టుపక్కల వాళ్లు వెంటనే సాయికిరణ్‌ను రిమ్స్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

సాయికిరణ్‌కు పెళ్లైన ఏడేళ్ల తర్వాత అతని భార్య గర్భం దాల్చింది. ఇటీవల ఆస్పత్రికి వెళ్లి చూయించుకోగా ఆమెకు కవలలని వైద్యులు చెప్పారు. ఇంకో పదిహేను రోజుల్లోనే డెలివరీ ఉందనగా ఇంతలో ఈ విషాద ఘటనతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. భార్య పుట్టినరోజునే సాయికిరణ్ చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయికిరణ్ కుటుంబ సభ్యుల అంగీకారంతో అతని కళ్లను ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తల్లి లక్ష్మీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.