యాప్నగరం

పని లేకుండా అప్పులతో ఎంతకాలం నెట్టుకొస్తాడు.. పాపం!!

అప్పు చేసి పప్పుకూడు తింటే చివరికి ఇబ్బందులు తప్పవని నిరూపించే ఘటన వెలుగుచూసింది. అప్పుల భారం ఎక్కువై.. తిరిగి చెల్లించే పరిస్థితి లేక బలవన్మరణానికి పాల్పడ్డాడో యువకుడు.

Samayam Telugu 10 Mar 2022, 8:33 pm
పని లేదు.. తెలిసిన వారి వద్ద చేబదుళ్లు.. అప్పులు తీసుకుంటూ నెట్టుకొచ్చాడు. చివరికి అవే తలకు మించిన భారంగా మారాయి. తీర్చే దారి కనిపించలేదు. ఒత్తిళ్లు పెరిగిపోయాయి. ఇక భరించలేకపోయిన యువకుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించాడు. గూడ్సు రైలు కింద తలపెట్టి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కొమరం భీం జిల్లాలో జరిగింది.
Samayam Telugu death


కాగజ్‌నగర్ మండలం చింతగూడకి చెందిన కట్టా రాజశేఖర్(34) అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలిసిన వారి నుంచి అప్పులు చేసిన రాజశేఖర్ పని లేకపోవడంతో తీర్చలేకపోయాడు. అప్పుల బాధలు ఎక్కువవడంతో పాటు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు భరించలేక అఘాయిత్యం చేసుకున్నాడు. చింతడూడ సమీపంలోని రైల్వే గేటు వద్ద మంచిర్యాల వైపు వెళ్తున్న గూడ్సు రైలు కింద తలపెట్టి ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.