యాప్నగరం

మద్యం మత్తులో.. వాటర్ అనుకొని లిక్కర్‌లో యాసిడ్ కలుపుకొని తాగడంతో..

Mancherial: ఓ వ్యక్తి మద్యం మత్తులో చేసిన పనికి అతని ప్రాణమే పోయింది. వాటర్ అనుకొని మద్యంలో యాసిడ్ కలుపుకొని తాగిన వ్యక్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.

Authored byRaj Kumar | Samayam Telugu 9 May 2022, 8:59 am
మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పనికి ఏకంగా తన ప్రాణమే పోయింది. మద్యం మత్తులో నీళ్లు అనుకొని యాసిడ్‌ను కలుపుకొని తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని హాజీపూర్‌ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన ఎర్రవేని మహేశ్ (29) సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే అతడికి మద్యం తీసుకునే అలవాటు ఉంది..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఈ క్రమంలోనే గత నెల 18న మద్యం తాగుతూ.. ఆ మత్తులో మంచి నీరు అనుకొని యాసిడ్‌ బాటిల్‌లోని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని తాగాడు. దీంతో అప్పటికప్పుడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గుర్తించిన అతడి కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పట్నుంచి చికిత్స పొందుతున్న అతను తాజాగా మృతి చెందాడు. కాగా, మహేశ్‌కు తండ్రి శంకరయ్య, తల్లి లక్ష్మి, భార్య స్వర్ణలత, కుమారుడు, కూతురు ఉన్నారు. దీనిపై హాజీపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.