యాప్నగరం

పేపర్ లీకేజీలు సర్వసాధారణం.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే.. ఈ వ్యవహారం అటు రాజకీయాల్లోను తీవ్ర దుమారం రేపుతోంది. అయితే.. ప్రభుత్వంపై ప్రధానంగా కేటీఆర్‌పై ప్రతిపక్షపార్టీల నేతలు పలు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీలు అనేది సర్వ సాధారణమైన విషయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 21 Mar 2023, 11:32 pm

ప్రధానాంశాలు:

  • పేపర్ లీక్ వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • పేపరీ లీకేజీలు సర్వ సాధారణమేనన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
  • ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయంగా తీవ్ర దుమారం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu indra
ఇంద్ర కరణ్ రెడ్డి
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. అటు విపక్ష నేతలు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కాగా.. వాటిని ఖండించేపనిలో నిమగ్నమయ్యారు అధికార పార్టీ నేతలు. ఈ క్రమంలోనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. ఇంటర్మీడియట్, డిగ్రీ, పదో తరగతిలో ఇలా చాలా పరీక్షల పేపర్లు సర్వసాధారణంగా లీకవుతుంటాయని తెలిపారు. ఇందులో మంత్రి కేటీఆర్‌ను దోషి అనడం.. సీఎంకు నోటీసు పంపాలని చెబుతున్నారని.. ఏమేమో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కేటీఆర్ దగ్గర పీఏగా పనిచేస్తున్న తిరుపతి అనే వ్యక్తి గ్రామంలో 100 మందికి 100కు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. ఇందుకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సిట్ దర్యాప్తు చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆ వంద మందికి నోటీసులు జారీ చేసిందన్నారు. రేవంత్ రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోపణలు చెయ్యడం సరికాదన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దుయ్యబట్టారు.


మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ఖండించారు. మంత్రి స్థాయిలో ఉండి.. పరీక్షలు లీకేజీ కావటం సర్వసాధారణమని చెప్పటం బాధాకరమన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలను ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఖండించారు. పేపర్ లీకేజీపై మంత్రి వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యమన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో సర్కార్ చెలగాటం ఆడుతోందన్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో 42 ఉద్యోగాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు.

'పాదచారులూ జర జాగ్రత్త..! పరధ్యానంతో ప్రాణాలు పొగొట్టుకోకండి..'
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.