యాప్నగరం

Peddapalli: రెండు నెలల పసికందును గోదావరిలో విసిరేసిన తల్లి

Godavari: రెండు నెలల పసికందను ఓ తల్లి గోదావరి నదిలో విసిరేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసకుంది. చిన్నారిని విసిరేసిన అనంతరం తాను ఆత్మహత్యకు యత్నించగా.. ఓ వ్యక్తి ఆమెను కాపాడి బయటకు తీశాడు. కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలతోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 24 May 2023, 10:54 am

ప్రధానాంశాలు:

  • పెద్దపల్లి జిల్లాలో అమానుష ఘటన
  • రెండు నెలల పసికందును గోదావరిలో విసిరేసిన తల్లి
  • ఆపై తాను నదిలో దూకి ఆత్మహత్యకు యత్నం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Peddapalli Mother
గోదావరి నది
Peddapalli Mother: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన రెండు నెలల పసికందును గోదావరి నదిలో విసిరేసింది. ఆపై తాను ఆత్మహత్య చేసుకోవాలని నదిలో దూకగా.. ఓ వ్యక్తి ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చాడు. పసకిందు మాత్రం గోదావరి నదిలో కొట్టుకుపోయి కన్నుమూసింది. ఘటన వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాకు చెందిన బొక్య రమేష్‌కు సెంటినరీ కాలనీకి చెందిన ప్రియాంకతో వివాహం జరిగింది. రమేష్ నాస్పూర్‌లో నివాసం ఉంటూ సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ దంపతులకు ఇటీవలే కూతురు జన్మించగా.. పాప వయస్సు 2 నెలలు. అయితే రెండు రోజుల క్రితం ప్రియాంక తన ముక్కు నుంచి రక్తం రావాటాన్ని గమనించింది. గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి రమేశ్ ఆమెను చికిత్స నిమిత్తం తీసుకురాగా పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
మంగళవారం (మే 23న) ఆసపత్రి నుంచి ప్రియాంక డిశ్చార్ అయింది. ఆ తర్వాత తన రెండు నెలల పసికందుతో ప్రియాంక ఆటోలో గోదావరి నది వద్దకు వెళ్లింది. అనంతరం పాపను నదిలోకి విసిరేసింది. ఆ తర్వాత తాను కూడా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించింది. ఆమె నదిలో దూకటం గమనించిన ఆటో డ్రైవర్ ప్రియాంకను రక్షించి ఒడ్డుకు చేర్చాడు. అనంతరం రివర్ పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే గోదావరి నదిలో రెండు నెలల చిన్నారి గల్లంతు కాగా.. పసికందు కోసం జాలర్లు వెతికారు. కొద్ది దూరంలో పాప కనిపించగా.. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందింది. కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలతోనే ప్రియాంక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తాను చనిపోతే పాప పరిస్థితి ఎలా అని భావించి చిన్నారిని కూడా నదిలో విసిరేసినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పదిహేను రోజుల క్రితం జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లోనూ ఇలాంటి అమానుష ఘటనే చోటు చేసుకుంది. పది రోజుల పసికందును ఓ తల్లి బండరాయికి కట్టి జలాశయంలో విసిరేసింది. జలాశయం వద్దకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అది గమనించి పోలీసులు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. జలాశయంలో నుంచి పాప మృతదేహాన్ని బయటకు తీశారు. ఆడపిల్ల పుట్టడం వల్లే కన్న తల్లి ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇలాంటి ఘటనలో మానవసంబంధాలు మసకబారుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నానాటికీ దిగజారుతున్న మానవ సంబంధాలకు ఇవి నిదర్శనమని అంటున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.