యాప్నగరం

నారా దేవాన్ష్ అక్షరాభ్యాసం.. అప్పుడు తిరుమలలో.. ఇప్పుడు బాసరలో!

బాసర సరస్వతీ దేవి ఆలయంలో నందమూరి బాలకృష్ణ మనవళ్ల అక్షరాభాస్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య సతీమణి వసుంధరతోపాటో చిన్న కూతురు, అల్లుడు.. పెద్ద కుమార్తె బ్రాహ్మణి పాల్గొన్నారు.

Samayam Telugu 5 Mar 2021, 10:46 pm
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు మనవడు.. నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు దేవాన్ష్‌కు శుక్రవారం బాసరలో అక్షరాభ్యాసం చేశారు. సరస్వతీ దేవి సన్నిధిలో అక్షరాలు దిద్దిచ్చారు. బ్రాహ్మణి తల్లి వసుంధర, ఇతర బంధువులతో కలిసి బాసర ఆలయానికి వచ్చారు. బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని కుమారుడు ఆర్యన్‌కు సైతం బాసరలో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి పూజా కార్యక్రమాలు చేయించారు.
Samayam Telugu devansh akshrabhyasam (File Photo)


2017 మే నెలలోనే నారా దేవాన్ష్‌కు అక్షరాభ్యాసం చేయించారు. తిరుమలలో దేవాన్ష్‌తో అక్షరాభ్యాసం చేయించారు. అ - అమ్మ, అ - అమరావతి, ఆ - ఆంధ్రప్రదేశ్, ఆ - ఆరోగ్యం, ఆదాయం అని దేవాన్ష్‌తో రాయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

వీడియో చూడండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.