యాప్నగరం

చెట్ల పొదల్లో శిశువు.. అందుకే వదిలించుకున్నారా ?

అటుగా మహిళ వెళ్తుండగా ఆమెకు ఓ పసిపాప ఏడుపు వినిపించింది. దీంతో ఆ ఏడుపు వస్తున్న వైపు ఆమె అడుగులు వేసింది. చూస్తే.. పొదల్లో అప్పుడు పుట్టిన ఆడబిడ్డను ఎవరో వదిలి వెళ్లిపోయారు.

Samayam Telugu 18 Apr 2021, 12:41 pm
ఆడపిల్ల అంటే చిన్న చూపు ఇంకా పోవడం లేదు. అమ్మాయిలు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా దూసుకుపోతున్నా.. ఇంకా కొన్ని చోట్ల ఆడపిల్ల పుడితే వద్దనుకుంటున్నారు. అమ్మాయిని భారంగా భావిస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో ఆడశిశువును చెట్ల పొదల్లో వదిలి వెళ్లిన దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu చెట్ల పొదల్లో ఆడశిశువు


జిల్లాలోని కుబీర్ మండలంలో ఈ అమానుష ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ పసికందును చెట్ల పొదల్లో పడేశారు. అటుగా వెళ్తున్న ఓ మహిళకు చెట్ల పొదల నుంచి శిశువు ఏడుపు వినిపించింది. దీంతో వెళ్లి చూడగా అక్కడ ఆడశిశువు పడి ఉంది. వెళ్లి గ్రామస్తులకు విషయం చెప్పింది. దీంతో ఆ గ్రామ పెద్దలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందును బయటికి తీయించి ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.