Students Agitation: హాస్టల్లో నీళ్లు రావట్లేదు.. భోజనంలో పురుగులు వస్తున్నాయి..!
Students Agitation: తెలంగాణలో విద్యార్థులకు ఆందోళనలే దిక్కవుతున్నాయి. చదువుకోవాల్సిన విద్యార్థులు.. కనీస వసతుల కోసం రోడ్డెక్కుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా ముధోల్ గిరిజన గురుకుల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో నీళ్లు రావట్లేదని రాస్తారోకో చేశారు. ఐదు రోజుల నుంచి నీళ్లు రాకపోవడంతో విసుగు చెందిన విద్యార్థినిలు.. నిరసన బాట పట్టారు. హాస్టల్లో నీళ్లు రావట్లేదు కానీ.. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu | 18 Jul 2022, 8:19 pm
ప్రధానాంశాలు:
- నిర్మల్ జిల్లా ముధోల్ గిరిజన గురుకుల విద్యార్థినులు ఆందోళన
- ఐదు రోజుల నుంచి నీళ్లు రావట్లేదని విద్యార్థుల ఆగ్రహం
- భైంసా-నిజామాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో
Students Agitation: తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని మొన్నటిదాకా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. రోజుల తరబడి ఎండలో ఎండుతూ.. వానలో నానుతూ హక్కుల కోసం పోరాడారు. అయినా వారి సమస్యలు తీరకపోగా.. కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆఖరికి ఆస్పత్రి పాలయ్యేలా చేశాయి. ఏదేమైనా బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) విద్యార్థుల ఉద్యమం ప్రభుత్వాన్ని కదిలించింది. వారినే స్పూర్తిగా తీసుకొని చాలా ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా.. నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకాలో విద్యార్థినిలు రోడ్డెక్కారు. ముధోల్లోని తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల (Mudhol tribal gurukulam) విద్యార్థినిలు.. కనీస వసతుల కోసం పాఠశాల ముందు బైఠాయించారు. భోజనం చేసే ప్లేట్లను చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత భైంసా-నిజామాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. 5 రోజుల నుంచి వసతి గృహంలో నీళ్లు రావడం లేదని.. విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వుయ్ వాంట్ వాటర్ (we want water) అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.
విద్యార్థుల ఆందోళన (Students Agitation)తో.. భైంసా-నిజామాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని విద్యార్ధులకు నచ్చ చెప్పి వసతి గృహంలోకి పంపించారు. వసతి గృహంలో మోటారు బాగు చేస్తామని హామీ ఇచ్చి విద్యార్థులను శాంతింపజేశారు. రెండు రోజుల్లో తమ సమస్యలను తీరుస్తామని ప్రిన్సిపాల్ (Principal) హామీ ఇచ్చారని.. ఒకవేళ నెరవేర్చకపోతే మళ్లీ ఆందోళన బాట పడతామని విద్యార్థులు హెచ్చరించారు.
వసతి గృహంలో మోటారు పాడవ్వడం వల్ల నీరు రావడం లేదని ప్రిన్సిపాల్ వెల్లడించారు. వీలైనంత త్వరగా మోటారు బాగు చేసి.. నీళ్లు వచ్చేలా చూస్తామని చెప్పారు.
విద్యార్థుల ఆందోళన (Students Agitation)తో.. భైంసా-నిజామాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని విద్యార్ధులకు నచ్చ చెప్పి వసతి గృహంలోకి పంపించారు. వసతి గృహంలో మోటారు బాగు చేస్తామని హామీ ఇచ్చి విద్యార్థులను శాంతింపజేశారు. రెండు రోజుల్లో తమ సమస్యలను తీరుస్తామని ప్రిన్సిపాల్ (Principal) హామీ ఇచ్చారని.. ఒకవేళ నెరవేర్చకపోతే మళ్లీ ఆందోళన బాట పడతామని విద్యార్థులు హెచ్చరించారు.
వసతి గృహంలో మోటారు పాడవ్వడం వల్ల నీరు రావడం లేదని ప్రిన్సిపాల్ వెల్లడించారు. వీలైనంత త్వరగా మోటారు బాగు చేసి.. నీళ్లు వచ్చేలా చూస్తామని చెప్పారు.