యాప్నగరం

ముందు వదిన.. తర్వాత మరదలు.. ఏంటమ్మా ఈ పని!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో వదిన, మరదళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ముందు వదిన పెట్రోలో పోసుకోగా.. తర్వాత మరదలు పురుగుల మందు తాగింది. ప్రస్తుతం ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 9 Apr 2023, 4:01 pm

ప్రధానాంశాలు:

  • ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో విషాదం
  • కుటుంబ కలహాలతో ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
  • వరుసకు ఇద్దరు వదిన, మరదళ్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Adilabad Family
మహిళల ఆత్మహత్యాయత్నం
Adilabad Family: ఆదిలాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెట్రలో పోసుకొని వదిన, పురుగుల మందు తాగి మరదలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలే వీరి ఆత్మహత్యాయత్నానికి కారణంగా స్థానికులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన పందుల లక్ష్మి, శేఖర్ దంపతలు. శేఖర్ ఇటీవల హనుమాన్ దీక్ష చేపట్టగా.. శుక్రవారం మాల విరమించాడు. శనివారం ఇంటికి చేరుకున్న శేఖర్.. మద్యం మత్తులో భార్య లక్ష్మీతో గొడవపడ్డాడు. ఆవేశంలో ఇంట్లో ఉన్న టీవీ, సెల్‌ఫోన్‌, ఇతర సామగ్రిని పగులగొట్టాడు. దీంతో మనస్థాపం చెందిన లక్ష్మీ అదే రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు మంటల్ని ఆర్పేశారు. అనంతరం ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లక్ష్మీ శరీరంపై తీవ్ర గాయాలు కాగా.. ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.

ఇక అదే గ్రామానికి చెందిన ముక్కరె స్వరూపకు తన భర్త శంకర్‌తో గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన ఆమె.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయానికి పాల్పడింది. లక్ష్మీ, స్వరూపలు ఇద్దరు వదిన, మరదళ్లు. ప్రస్తుతం స్వరూపకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఇలా క్షణికావేశంలో ఒకే కుటుంబానికి చెందిన వదన, మరదళ్లు ఆత్మహత్య చేసుకోవటం స్థానికంగా కలకలం రేపింది. గొడవలు ఉంటే పరిష్కరించుకోవలే కానీ.. అలా చేయటమేంటని స్థానికులు అంటున్నారు.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.