యాప్నగరం

భైంసా: 20 మంది పోలీసుల ప్రాణాలు కాపాడిన జనం.. ఎస్పీ అభినందనలు

Bhainsa: ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో 22 మంది పోలీసులతోపాటు, బైంసా యువత సైతం ఎంతో సాయం అందించింది. బాధితులను బైంసాలోని ఎస్సీ హస్టల్ పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు.

Samayam Telugu 22 Jul 2021, 8:35 pm
తెలంగాణలో ఆగకుండా కురుస్తున్న వానలకు నిర్మల్‌తో పాటు బైంసా నీటిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆటో నగర్‌లో సహాయక కార్యక్రమాలు సాగుతున్నాయి. అయితే, ఈ వరద నీటిలో భైంసా ఎన్‌.ఆర్‌.గార్డెన్‌లో బస చేసిన 20 మంది పోలీసులు వరద నీటిలో చిక్కుకుపోయారు. దీంతో 12 మంది గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి బోట్ల సాయంతో వారిని రక్షించారు. అంతేకాక, ప్రజల్ని కూడా కాపాడారు. రెండు నాటు పడవల్లో 4 గంటలు శ్రమించి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Samayam Telugu నిర్మల్ జిల్లాలో వరద
nirmal floods


ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో 22 మంది పోలీసులతోపాటు, బైంసా యువత సైతం ఎంతో సాయం అందించింది. బాధితులను బైంసాలోని ఎస్సీ హస్టల్ పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. భైంసా సమీపంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తేశారు. దీంతో భైంసా ఆటోనగర్‌లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.

వర్షపాతం ఇలా..
గ‌డిచిన 24 గంట‌ల్లో నిర్మల్ జిల్లాలో వాన దంచికొట్టింది. జిల్లాలోని న‌ర్సాపూర్‌లో అత్యధికంగా 245 మిల్లీ మీటర్ల వాన పడింది. తెలంగాణ వ్యాప్తంగా సరాసరిన 44.2 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదు కాగా, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 115.5 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 204 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. జూన్ 1వ తేదీ నుంచి జులై 22 వ‌ర‌కు రాష్ర్ట వ్యాప్తంగా 474.3 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.