యాప్నగరం

బైక్‌పై వస్తున్న సర్పంచ్.. పులి పంజా తగలడంతో కింద పడి గాయాలు

బండిపై వెనుక కూర్చొని వస్తున్న సర్పంచ్‌పై పులి దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. బైక్ నడుపుతున్న వ్యక్తి గట్టిగా కేకలు వేయడతో పెద్ద పులి అడవిలో వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

Samayam Telugu 14 Aug 2021, 1:38 pm
కుమురంభీం జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం రేపుతోంది. బైక్‌పై వస్తున్న గ్రామ సర్పంచ్‌పై పులి ఒక్కసారిగా దూకిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పెంచికల్ పేట్ మండలం అగార్ గూడ అటవీ ప్రాంతంలో పెద్దపులి మనుషులపై పంజా విసురుతోంది. కాగజ్ నగర్ నుండి పెంచికల్ పెట్ మండలం మోర్లిగూడ గ్రామానికి బైక్ పై సర్పంచ్ ఈశ్వరి బాయి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


బైక్‌పై వెళ్తున్న ఈశ్వరి బాయి వెళ్లుతుండగా బైక్ పై నుండి పెద్దపులి దూకింది. పులి పంజా తాకడంతో ఆమె బండిపై నుంచి కింద పడి పోయినట్లు ఈశ్వరి అందోళన వ్యక్తం చేశారు. ఆమెకు
స్వల్పంగా గాయాలయ్యాయని తెలిపారు. బైక్ నడుపుతున్న వ్యక్తి కేకలు వేయడంతో అటవీలోకి పెద్దపులి వెళ్లిపోయిందని బాదితులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు పులి సంచారంతో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.