యాప్నగరం

విషాదం.. గంటల వ్యవధిలో అన్నదమ్ముల మృతి

గంటల వ్యవధిలోని ఇద్దరు అన్నదమ్ములు కన్నుమూశారు.. తమ్ముడు గుండె పోటుతో చనిపోయాడని తెలిసి.. అక్కడికెళ్లిన అన్నకు గుండె పోటు వచ్చింది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా ఆలోపే మరణించాడని వైద్యులు తెలిపారు.

Authored byRaj Kumar | Samayam Telugu 9 May 2022, 3:38 pm
ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములు మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ్ముడు గుండె పోటుతో చనిపోయాడన్న వార్త విని అన్న గుండె కూడా ఆగిపోయిన సంఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు గుండెపోటుతో మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
Samayam Telugu మరణించిన అన్నదమ్ములు


వివరాల్లోకి వెళ్తే.. లక్సెట్టిపేట పట్టణానికి చెందిన గాజుల భాస్కర్ గౌడ్ (47) గుండె పోటుతో జగిత్యాల జిల్లా ధర్మపురిలో మృతి చెందాడు. తన తమ్ముడు భాస్కర్ గౌడ్ మృతి చెందాడని తెలుసుకొని శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ గౌడ్ మృతదేహం చూసేందుకు వెళ్లాడు. అక్కడ ఒక్క సారిగా కుప్ప కూలి పడిపోయాడు. అయితే వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించాడని వైద్యులు తెలిపారు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు గంటల వ్యవధిలో గుండెపోటుతో మృతి చెందటంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.