యాప్నగరం

Mancherial: పాప కోసం జోరువానలో వచ్చి.. పేరెంట్స్ మృతి, కలచివేసే విషాద ఘటన

పాప ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు తిరిగిరాలేదు. ఊహించని షాక్‌తో పేరెంట్స్ నడిరోడ్డుపై విగతజీవులుగా పడిపోయారు. తీవ్రగాయాలతో పాప ఆస్పత్రి పాలైంది. మంచిర్యాలలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 20 Sep 2021, 3:49 pm
ప్రకృతి ప్రకోపానికి పేరెంట్స్ బలైపోయారు. పాప ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కళ్లెదుటే అమ్మానాన్న చనిపోవడంతో అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారి ఒంటరైంది. నడిరోడ్డుపై విగతజీవులుగా పడి ఉన్న దంపతులు, తీవ్రగాయాలతో కొనఊపిరితో కొట్టుకుంటున్న చిన్నారి దృశ్యాలు చూపరులను కలచివేశాయి. పాప కోసం జోరువానలో బయటికొచ్చిన పేరెంట్స్ పిడుగుపాటుకి మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.
Samayam Telugu విగతజీవులుగా దంపతులు
couple death


మంచిర్యాల పట్టణంలోని ఫ్లైఓవర్‌పై విషాద ఘటన జరిగింది. బైక్‌పై వెళ్తున్న కుటుంబంపై పిడుగుపడడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తమ మూడేళ్ల చిన్నారికి ఆరోగ్యం బాగోకపోవడంతో జోరువానలో ఆస్పత్రికి తీసుకెళ్లిన పేరెంట్స్.. తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. వర్షంలోనే వెళ్తుండగా అకస్మాత్తుగా పిడుగుపాటుకు గురయ్యారు. భార్యాభర్తలు పిడుగుకి బలి కాగా.. చిన్నారి గాయాలపాలైంది. ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.