యాప్నగరం

Morning Walk: ప్రాణం మీదకు తెచ్చిన ఉదయం వాకింగ్.. షాకింగ్ ఘటన

పొద్దున్నే వాకింగ్‌కి వెళ్లిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అదుపుతప్పిన వాహనం రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు అమాంతం మింగేసింది. అతనితో పాటు వాహనంలో ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 28 Oct 2021, 8:22 pm
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజాము సమయంలో వేగంగా దూసుకొచ్చిన వాహనం మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. డ్రైవర్ అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో వాహనం పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వాకింగ్‌కి వచ్చిన వ్యక్తితో పాటు వాహనంలో ఉన్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని కిన్వట్ నుంచి జిల్లాలోని దండేపల్లి మండలం ఓడరేవు వద్దనున్న కాకో దేవుని దర్శించుకునేందుకు మ్యాక్సీ వాహనంలో భక్తులు వచ్చారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


ఉట్నూర్ మండలం గొదరిగూడ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వ్యక్తులపైకి దూసుకుపోయింది. గురువారం ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేసే క్రమంలో బోల్తా కొట్టడంతో అందులో ఇరుక్కుని కనక జంగు అనే వృద్ధుడు మృతి చెందాడు. రోడ్డుపై వాకింగ్‌కి వచ్చిన మేఘరాజ్ కూడా ప్రమాదంలో చనిపోయారు. వాహనం బోల్తా కొట్టడంతో పదిమందికి పైగా గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.