యాప్నగరం

మళ్లీ జనంలో కరోనా భయం.. భర్తకు వైరస్ భార్య ఆత్మహత్య

భర్తకు కరోనా సోకి ఆస్పత్రి పాలయ్యాడు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో భయంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అది భరించలేని ఆమె ప్రాణం తీసుకుంది.

Samayam Telugu 14 Apr 2021, 12:59 pm
కరోనా సెకండ్ వేవ్ మరోసారి గతంలో నెలకొన్న పరిస్థితుల్ని గుర్తు చేస్తోంది. కరోనా వైరస్ భయంతో గతంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయి. భర్తకు కరోనా సోకిందన్న భయంతో భార్య ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీకి చెందిన సుద్దాల జలజ(54) అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Samayam Telugu భర్తకు కరోనా భార్య ఆత్మహత్య


జలజ భర్తకు కరోనా సోకింది. అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆ బాధ భరించలేక జలజ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వన్ టౌన్ పోలిసులు. అత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ‌ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.