యాప్నగరం

ఆదిలాబాద్: యువతి దారుణ హత్య.. ప్రేమ పెళ్లే కారణమా?

ఓ యువతి అనుమానాస్పద మృతి ఆదిలాబాద్‌లో కలకలం రేపుతోంది. గొంతు వద్ద గాయాలతో రక్తపు మడుగులో పడి ఉంది. కొంతకాలంగా ఆమె మరో కులానికి చెందిన యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 27 May 2022, 4:09 pm
దిలాబాద్‌లో ఓ యువతి అనుమానాస్పద మృతి అలజడి రేపుతోంది. నార్నూర్ మండలంలోని నాగల్‌కొండ గ్రామంలో యువతి మెడపై కత్తి గాయంతో రక్తపు మడుగులో మృతి చెంది పడిపోయి ఉంది. ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే, పరువు హత్య కావచ్చొనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు యువతి రాజేశ్వరి కొంత కాలంగా మరో మతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు అతడిని మర్చిపోవాలని చెప్పినా ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu యువతి ఫైల్ ఫొటో
Adilabad girl death


కొద్ది రోజుల కిందట ఈ జంట పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఆ జంటను విడదీసి వేర్వేరుగా ఉంచినట్లు సమాచారం. తల్లిదండ్రుల వద్ద ఉంటున్న యువతి అకస్మాత్తుగా మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో పరువు హత్యలు కలకలం రేపుతున్న వేళ ఈ యువతి మృతి ఘటన ఆందోళన కలిగిస్తోంది.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.