యాప్నగరం

రాజేంద్రనగర్ బాలుడి మిస్సింగ్ విషాదం.. శవమై తేలిన చిన్నారి, చంపేశారా?

బాలుడి మిస్సింగ్ కేసు విషాదంతంగా ముగిసింది. రెండేళ్ల చిన్నారి అనూహ్యంగా శవమై కనిపించాడు. ఎవరో కావాలనే హత్య చేసి నీటి గుంటలో పడేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు విచారణ చేపట్టారు.

Samayam Telugu 28 Aug 2021, 4:07 pm
నగరంలో కలకలం రేపిన రాజేంద్రనగర్ బాలుడి మిస్సింగ్ విషాదాంతమైంది. అనూహ్యంగా ఇంటికి సమీపంలోనే నీటి గుంటలో శవమై తేలాడు. బాలుడిని చంపేశారా? లేక ఆడుకుంటూ వెళ్లి పడిపోయి చనిపోయాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజేంద్రనగర్‌‌ పరిధిలో శుక్రవారం రెండేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలోనే విషాద ఘటన వెలుగుచూసింది. ఇంటి సమీపంలోనే ఉన్న ఓ నీటి గుంటలో బాలుడు శవమై కనిపించాడు. చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అదృశ్యమైన బాలుడిదిగా గుర్తించారు. వెంటనే చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బుడిబుడి అడుగులతో అలరించే చిన్నారి విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. బాలుడిని చంపేసి నీటి గుంటలో పడేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం బాడీని ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
baby


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.