యాప్నగరం

Hyderabad: గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి... కూలిన 20 అడుగుల విగ్రహం

వినాయక నిమజ్జనం వేళ హైదరాబాద్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జనం కోసం తరలిస్తుండగా 20 అడుగుల మట్టి విగ్రహం కూలిపోయింది. దీంతో భక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 9 Sep 2022, 11:56 am
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం ఊపందుకుంది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణపయ్యలు గంగమ్మ ఒడిలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ట్యాంక్‌బండ్ సహా నగరంలోని అనేక చెరువుల్లో నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే గణేశ్ నిమజ్జనం వేళ హైదరాబాద్‌లోని హిమయత్‌‌నగర్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది.
Samayam Telugu Image

రియల్ ఎస్టేట్ జోరు... రూ.10.5లక్షల పలికిన బీరంగూడ గణేశుడి లడ్డూ
కర్మన్‌ఘాట్‌లోని టీకేఆర్‌ కాలేజీ వద్ద నవజీవన్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 20 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే నిమజ్జనం కోసం ఆ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌కు తరలిస్తుండగా హిమాయత్‌ నగర్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ వద్ద విగ్రహం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో శోభాయాత్రలో పాల్గొన్నవారు షాకయ్యారు. విగ్రహం కూలిపోవడం అరిష్టమని కొందరు చర్చించుకున్నారు. అయితే విగ్రహాన్ని నిమజ్జనం తరలించే ప్రయత్నంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని కొందరు అంటున్నారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.