యాప్నగరం

ప్లాట్ ఫాంపై యువతి వెయిటింగ్.. ‘శబరి’ వచ్చేలోపే.. షాకింగ్

సికింద్రాబాద్ స్టేషన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శబరి ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురుచూస్తున్న యువతి అనూహ్యంగా కనిపించకుండా పోయింది. వాష్‌రూమ్‌కెళ్లి తిరిగిరాలేదు.

Samayam Telugu 1 Aug 2021, 6:26 pm
వాష్ రూమ్‌కి వెళ్లొస్తానని చెప్పిన యువతి కనిపించకుండా పోయిన షాకింగ్ ఘటన సికింద్రాబాద్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. తమిళనాడులోని రాణిపేట జిల్లాకు చెందిన మిని ఏంజెల్(22) నర్సుగా పనిచేసేది. ఈ నెల 29న తమిళనాడు వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలసి సికింద్రాబాద్ స్టేషన్‌కి వచ్చింది. ప్లాట్‌ఫాంపై శబరి ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురుచూస్తుండగా బాత్రూమ్‌కి వెళ్లి వస్తానని చెప్పి ఏంజెల్ వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు స్టేషన్ పరిసరాల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో జీఆర్పీ పోలీసులను ఆశ్రయించారు. స్టేషన్‌లో తమిళనాడు యువతి అదృశ్యం కావడం కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
sad woman


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.