యాప్నగరం

మార్చురీలో పదిరోజులుగా పసిపాప మృతదేహం.. రాని తల్లిదండ్రులు

ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి చిన్నారి కిందపడింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరేళ్ల చిన్నారి మృతిచెందింది.అయతే పాప మృతదేహం తీసుకెళ్లేందుకు మాత్రం తల్లిదండ్రులు రాలేదు.

Samayam Telugu 3 Jan 2021, 1:13 pm
పాపం.. మార్చురీలోనే పది రోజులుగా పాప మృతదేహం ఉండిపోయింది. ఎవరూ రాకపోవడంతో మార్చురీలోనే చిన్నారి మృతదేహం ఉండిపోయింది. చిన్నారి చనిపోయి పది రోజులు అవుతోంది. కానీ మృతదేహం కోసం కుటుంబసభ్యులు కాని, బంధువులు కానీ ఎవరూ రాలేదు. జవహర్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి సర్కిల్‌, మౌలాలీకి చెందిన ఆలీఖాన్‌ తన కూతురు మరియమ్‌ బేగం (6)తో డిసెంబర్‌ 20వ తేదీన దమ్మాయిగూడాలో ఉన్న బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చారు.
Samayam Telugu మార్చురీలో చిన్నారి మృతదేహం
child dead body in mortuary


Read More: Hyderabad Biryani: బిర్యానీలో బొద్దింక.. తిన్నవారికి షాక్

అయితే ప్రమాదవశాత్తు చిన్నారి మెట్ల పైనుంచి కిందపడింది. వెంటనే బంధువులు చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని కేస్‌షీట్‌లో ఉంది. అక్కడే మూడు రోజుల పాటు చికిత్స పొందిన బేగం డిసెంబర్‌ 23న మృతి చెందింది. మృతదేహం కోసం ఎవరూ రాకపోవడంతో మార్చురీలో ఉంచారు. జవహర్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిస్తే 8555872362. 8897672768 ఫోన్‌ నంబర్‌లలో సంప్రదించాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.