యాప్నగరం

ఆడుకోవడానికి వెళ్లి బాలుడి మిస్సింగ్.. మరుసటి రోజు.. షాక్

ఆడుకుంటానని ఇంటి నుంచి బయటికెళ్లిన ఏడేళ్ల కొడుకు తిరిగిరాలేదు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆ మరుసటి రోజే గుండెలు పగిలే దిగ్భ్రాంతికర విషయం తెలిసి కుప్పకూలిపోయారు.

Samayam Telugu 20 Oct 2021, 4:45 pm
ఏడేళ్ల బాలుడు ఆడుకోవాడానికి ఇంటి నుంచి బయటికెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. చుట్టుపక్కల వెతికిచూసినా ఫలితం లేకపోయింది. ఏం జరిగిందోనన్న ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు ఉదయాన్నే దిగ్భ్రాంతికర విషయం వినాల్సి వచ్చింది. తమ బిడ్డ సెప్టిక్ ట్యాంక్‌లో విగతజీవిగా కనిపించడంతో కన్నోళ్ల గుండెపగిలింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప సముదాయంలో రాజు, అనుబాయ్ దంపతులు నివాసముంటున్నారు. వారి కుమారుడు అరవింద్(7) నిన్న సాయంత్రం ఆడుకునేందుకు బయటికి వెళ్లాడు. ఎంతసేపయినా అరవింద్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.

తమ బిడ్డ కనిపించడం లేదని చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం అనూహ్యంగా సమీపంలోని సెప్టిక్ ట్యాంక్‌లో శవమై కనిపించాడు. ప్రమాదవశాత్తూ సెప్టిక్ ట్యాంక్‌లో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని డెడ్‌బాడీని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.