Hyderabad: తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ పాలన నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సర్కార్పై రాష్ట్రంలోని కొంత మంది పాజిటివ్గా ఉంటారు. మరికొందరు నెగెటివ్గానూ ఉంటారు. అందుకు కారణాలు.. రాజకీయ పార్టీల సిద్ధాంతాలు కావొచ్చు.. లేక ప్రభుత్వం వల్ల తమకు ఎలాంటి న్యాయం జరగకపోయి ఉండొచ్చు.. సర్కారు తీరు నచ్చకపోవటం కావొచ్చు.. లేక ఇంకా వేరే ఇతర కారణాలు కూడా ఉండి ఉండొచ్చు. అయితే.. ఇక్కడ ఓ డెబ్బై ఏళ్ల వృద్ధుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీరు, కేసీఆర్ పాలన గురించి చెప్తున్న మాటలు వింటే.. సర్కారు మీద ఎంత వ్యతిరేకత ఉన్నా ఇట్టే మనసు మారిపోవటం ఖాయం. అయితే.. ప్రస్తుత కాలంలో కడుపు నిండా అన్నం పెట్టిన దేవుడు కేసీఆర్ అని.. ఆయనకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువేనంటూ సీఎంను ఆకాశానికెత్తేశారు. అన్నీ ఇస్తున్న ఆపద్భాందవుడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. అలాంటి నాయకుడు మరొకరు రారు.. రాలేరు అంటూ నొక్కి వక్కానిస్తున్నాడు. "నాకు డెబ్బై సంవత్సరాలు.. నేను అన్ని ప్రభుత్వాలు చూసినా.. ఇంత మంచి ప్రభుత్వమైతే లేదు. కేసీఆర్ నా తోడబుట్టినోడు కాదు.. నా కన్న తండ్రికాదు.. నా బంధువు కాదు.. కానీ కడుపు నిండా అన్నం పెట్టినోడు దేవుడితో సమానం. 2016 రూపాయలు ఏ కష్టం చేస్తే వస్తున్నాయి.. కేవలం సంతకం పెడితే ఇస్తుండు. నాకు ఏడుగులు కూతుర్లు, ఓ కొడుకు. అందరి పెళ్లిళ్లలకు లక్ష రూపాయల సాయం చేస్తుండు. నా బిడ్డ డెలివరీ అయితే.. ఇంటికే అంబులెన్స్ పంపించి.. కాన్పు చేసి.. బిడ్డ పుట్టిన తర్వాత డబ్బులిచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి.. ఇంటికి క్షేమంగా పంపిస్తుండు. అపద్భాందవుడు ఆ శ్రీరాముడే ఈ కేసీఆర్.. ఎట్ల మర్చిపోతం." అంటూ కేసీఆర్ చేస్తున్న పథకాల గురించి గొప్పగా చేప్తూ.. ఆయనను దేవుడంటా ఆకాశానికెత్తేశాడు ఈ తాత. ఈ పెద్దాయన మాటలు వింటే.. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్లు ఒక్క నిమిషం ఆగి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో.
మరి ఉచితాలంటూ.. ఇచ్చే పథకాలను తీసేయ్యాలని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది కదా.. మరి దానికేమంటావని అడిగితే.. అందుకు కూడా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు తాత. "అన్నం పెడుతుంటే లాగేస్తుండంటే.. వాడు మనవుడు కాదు రాక్షసుడు. పది మంది కడుపు నిండుతున్న పథకాన్ని తీసివేయాలనే వాన్ని చెప్పుతో కొట్టాలి." అంటూ భగ్గుమన్నాడు. మళ్లీ వచ్చేది కేసీఆరేనని.. కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఇంకేది రాదు.. ఒకవేళ వచ్చినా ఉండదంటూ బల్లగుద్ది చెప్తున్నాడు ఈ డెబ్బై ఏళ్ల తాత. మరి ఏం జరుగుతుందో చూడాలి.. ఇంత
మరి ఉచితాలంటూ.. ఇచ్చే పథకాలను తీసేయ్యాలని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది కదా.. మరి దానికేమంటావని అడిగితే.. అందుకు కూడా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు తాత. "అన్నం పెడుతుంటే లాగేస్తుండంటే.. వాడు మనవుడు కాదు రాక్షసుడు. పది మంది కడుపు నిండుతున్న పథకాన్ని తీసివేయాలనే వాన్ని చెప్పుతో కొట్టాలి." అంటూ భగ్గుమన్నాడు. మళ్లీ వచ్చేది కేసీఆరేనని.. కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఇంకేది రాదు.. ఒకవేళ వచ్చినా ఉండదంటూ బల్లగుద్ది చెప్తున్నాడు ఈ డెబ్బై ఏళ్ల తాత. మరి ఏం జరుగుతుందో చూడాలి.. ఇంత
- Read More Telangana News And Telugu News