యాప్నగరం

హైదరాబాద్‌లో విషాదం.. పతంగి ఎగురవేస్తూ చిన్నారి మృతి

స్నేహితులతో కలిసి సరదాగా పతంగి ఎగుర వేస్తున్న చిన్నారి పొరపాటున నీటి గుంతలో పడిపోయాడు. రెండేళ్ల క్రితం భర్త చనిపోయి బిడ్డతో కలిసి బతుకుతున్న మహిళకు చిన్నారి మృతి తీవ్ర విషాదంలో నింపింది.

Samayam Telugu 12 Jan 2021, 10:51 am
హైదరాబాద్ మియాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పటేల్ చెరువులో పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. పతంగి ఎగురవేసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండు సంవత్సరాల క్రితమే భర్తను, ఇప్పుడు కుమారుడి పోగొట్టుకున్న బాలుడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది.
Samayam Telugu కుంటలో పడి చిన్నారి మృతి


మియాపూర్‌లో చెరువు సుందరీకరణలో భాగంగా రెండేళ్ల క్రితం చెరువులో పనులు ప్రారంభించారు. ఏడాదిన్నర కాలంగా అర్ధాతంరంగా నిలిపివేశారు. ఇప్పుడు ఆ గుంతలోనే బాలుడు పడి చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. గుత్తేదారుల సమన్వయ లోపం వల్ల దుర్ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమయానికి పనులు పూర్తి చేసి ఉంటే బాలుడు దూరమయ్యేవాడు కాదని ఆరోపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.