యాప్నగరం

‘పుష్ప’ తరహాలో గంజాయి తరలింపు.. ఏపీ టు యూపీ వయా తెలంగాణ.. చివరికి

ఓ ముఠా పోలీసులకు ఏ అనుమానం రాకుండా పశువుల దాణా బస్తాల మాటున గంజాయి తరలించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయింది. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్‌లో చోటు చేసుకుంది.

Authored byRaj Kumar | Samayam Telugu 8 May 2022, 3:47 pm
పుష్ప సినిమా తరహాలోనే స్మగ్లర్లు వినూత్న పద్ధతిలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ముఠా పోలీసులకు ఎటువంటి అనుమానం రాకుండా పశువుల దాణా బస్తాల మాటున గంజాయి తరలించే ప్రయత్నం చేసింది. కానీ చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలైంది.
Samayam Telugu గంజాయి తరలిస్తుండగా పట్టుబడిన లారీ.. కేసు వివరాలు వెల్లడిస్తున్న పోలీసు అధికారి


హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్‌లో ఆదివారం ఉదయం భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్నట్లుగా ముందస్తు సమాచారం రావడంతో ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ లారీలో పత్తి విత్తనాల మాటున గంజాయి తరలిస్తున్న వ్యవహారం గుట్టు రట్టయింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి రూ.2 కోట్ల విలువైన 800 కేజీల గంజాయిని, లారీని స్వాధీనం చేసుకున్నారు.. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను సోనూ సింగ్, ఖుషి మహమ్మద్‌గా గుర్తించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ గంజాయిని ఏపీలోని రాజమండ్రి నుంచి తెలంగాణలోని హైదరాబాద్ మీదుగా ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు పంపుతున్నట్లు గుర్తించారు. అరెస్టు చేసిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు వివరాలను మీడియాకు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.