యాప్నగరం

Sangareddy District: ఫ్రెండ్స్‌ దగ్గరకు వెళుతున్నానని చెప్పి బయటకు.. తిరిగి శవమై ఇంటికి..

Sangareddy District: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడి అనుమానాస్పద మృతి తల్లిదండ్రులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. ఈ నెల 14న ఇంటి నుంచి వెళ్లిన ప్రసాద్ అనే యువకుడు శవమై ఇంటికొచ్చాడు. పోలీసులు ఈ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేపడుతున్నారు.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 20 Mar 2023, 12:47 pm

ప్రధానాంశాలు:

  • సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం
  • యువకుడి అనుమానాస్పద మృతి కలకలం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu death
మృతి
Sangareddy District: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యవకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఈ నెల 14వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు.. చివరకు విగతజీవిగా మారాడు. కుళ్లిపోయిన స్థితిలో యువకుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. IDA బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ నెల 14న భావాని ప్రసాద్ (25) అనే యువకుడు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీంతో బంధువులు, ఫ్రెండ్స్‌కి కాల్ చేసి ఆరా తీశారు. బంధువుల ఇళ్లలో కూడా వెతికారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. కానీ యువకుడి గురించి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో.. ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో బొల్లారం పారిశ్రామికవాడలో కుళ్ళిపోయిన స్థితిలో ప్రసాద్ మృతదేహం లభ్యమైంది. దీంతో తల్లిదండ్రులను పిలిపించి అడగ్గా.. తమ కుమారుడిదే అని తెలిపారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిపై బొల్లారం పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆత్మహత్యనా? లేదా హత్యనా ? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు చివరకు విగతజీవిగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.