యాప్నగరం

Hyderabad: చికెన్ పెట్టలేదని చివరి నిమిషంలో ఆగిపోయిన పెళ్లి.. పోలీసుల ఎంట్రీతో ఏమైందంటే..?

Hyderabad: పెళ్లిపీటలపై వధూవరులు కూర్చున్న తర్వాత పెళ్లిళ్లు అర్థాంతరంగా ఆగిపోతున్న ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. కట్నం ఎక్కువ ఇవ్వలేదని లేక ప్రేమ వ్యవహారం బయటపడిందనే కారణాలతో కొద్దిసేపట్లో జరగాల్సిన పెళ్లిళ్లు ఆగిపోతూ ఉంటాయి. కానీ పెళ్లి విందులో నాన్ వెటిటేరియన్ భోజనం పెట్టలేదని పెళ్లిళ్లు ఆగిపోతుండటం ఆశ్చర్యకరంగా మారుతుంది. గతంలో దేశంలో పలుచోట్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 29 Nov 2022, 8:20 am
Hyderabad: పెళ్లి విందులో చికెన్ పెట్టలేదని జరగాల్సిన పెళ్లి ఆగిపోయిన విచిత్ర ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. షాపూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ ఘటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి పెళ్లికుమార్తె బంధువులు పోలీసులను ఆశ్రయించడం, ఇరు వర్గాల మధ్య పోలీసులు సయోధ్య కుదర్చడంతో పెళ్లికి మరో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
Samayam Telugu chicken curry
చికెన్ కర్రీ


నగరంలోని జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన ఓ యువకుడికి కుత్బుల్లాపూర్‌కి చెందిన యువతితో పెళ్లి ఫిక్స్ అయింది. సోమవారం తెల్లవారుజుమున 3 గంటలకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయగా... ఆదివారం రాత్రి అతిథులకు వధువు కుటుంబీకులు విందు ఏర్పాటు చేశారు. పెళ్లికూతురు తరపువారిది బీహార్‌కి చెందిన మార్వాడీ కుటుంబం కావడంతో.. వారి సంప్రదాయం ప్రకారం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే విందులో ఏర్పాటు చేశారు. అయితే ఈ పెళ్లికి వరుడి స్నేహితులు చాలామంది వచ్చారు. ఈ సందర్భంగా విందులో నాన్ వెజిటేరియన్ ఫుడ్ లేకపోవడం చూసి వాళ్లు గొడవకు దిగారు.

విందులో చికెన్ ఎందుకు పెట్టలేదని, చికెన్ లేకుండా పెళ్లి భోజనం ఏంటి? అని వధువు తరపు కుటుంబసభ్యులు, బంధువులతో వరుడి స్నేహితులు గొడవకు దిగి వెళ్లిపోయారు. ఈ విషయంలో పెళ్లికి వచ్చిన అతిథులకు సరిగ్గా వడ్డించలేదంటూ పెళ్లికూతురు కుటుంసభ్యులను హేళన పెళ్లికొడుకు కుటుంబసభ్యులు మాట్లాడారు. దీంతో వధువు, వరుడి కుటుంబసభ్యులు, బంధువుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు దూసుకెళ్లి కొట్టకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ గొడవతో కాసేపట్లో జరగాల్సిన పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది.

ఈ గొడవలో ఇద్దరు మహిళలు స్పృహతప్పి పడిపోవడంతో దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. ఈ గొడవపై వధువు తరపు కుటుంబసభ్యులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల సీఐ పవన్ ఇరు వర్గాలను కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చారు. రెండు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. దీంతో ఇరు వర్గాల కుటుంబీకులు మాట్లాడుకుని పెళ్లికి బుధవారం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. గొడవ సద్దుమణగడంతో ఇరు కుటుంబాల బంధువుల ఊపిరిపీల్చుకున్నారు. విందులో చికెన్ పెట్టకపోవడంతో కొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయిన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది తొలిసారి కాదు. గతంలో పెళ్లి విందులో చికెన్, మటన్ పెట్టలేదని పెళ్లిని రద్దు చేసుకున్న ఘటనలు దేశంలో చాలాచోట్ల జరిగాయి.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.