యాప్నగరం

Rangareddy District: దారుణ ఘటన.. మహిళను హత్య చేసి గోనెసంచిలో ప్యాకింగ్..

Rangareddy District: రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలంలో దారుణం జరిగింది. మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి సంచిలో పడేసి వెళ్లిపోయారు. మహిళకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 12 Apr 2023, 11:34 am

ప్రధానాంశాలు:

  • రంగారెడ్డి జిల్లాలో ఘోరం
  • మహిళను దారుణంగా హత్య చేసిన దండగులు
  • గోనె సంచిలో ప్యాక్ చేసి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu women
మహిళ హత్య
Rangareddy District: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన కొంతమంది దుండగులు.. మృతదేహాన్ని గోనెసంచిలో ప్యాక్ చేసి పడేశారు. దుర్వాసన రావడంతో దీనిని గమనించిన స్ధానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మహిళ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మహేశ్వరం మండలం సర్దార్ నగర్ గేటు సమీపంలో ఈ దారుణం వెలుగుచూసింది. గుర్తుతెలియని కొందరు దుండగులు ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. అనంతరం గోనెసంచిలో ప్యాకింగ్ చేసి అక్కడే పడేశారు. అయితే వాసన రావడాన్ని స్థానికులు గుర్తించి వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి పహాడీ షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. మహిళ వయస్సు 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని గుర్తించారు.

మూడు రోజుల క్రితమే మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళను రేప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మహిళను చంపిన తర్వాత కట్టివేసి సంచిలో వేసి వెళ్లినట్లుగా చెబుతున్నారు. మహిళ వివరాలతో పాటు కుటుంబసభ్యుల వివరాలను కొనుగోనేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఏదైనా మహిళ మిస్సింగ్ కేసు నమోదైందా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

మహిళను ఎవరు హత్య చేశారు? హత్యకు గల కారణాలేంటి? అనేది పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహిళ కుటుంబసభ్యుల వివరాలు తెలిసిన తర్వాత వారికి మృతదేహాన్ని అప్పగించనున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏసీపీ అంజయ్య స్పష్టం చేశారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.