యాప్నగరం

Jeedimetla: రత్నదీప్‌లో పాడైన పదార్థాలు విక్రయం.. స్టోర్ మందు కస్టమర్ల ఆందోళన

Jeedimetla: పాడైన పదార్థాలను విక్రయిస్తున్న సుచిత్ర రత్నదీప్ సూపర్ మార్కెట్‌పై చర్యలు తీసుకోవాలని కస్టమర్లు స్టోర్ ముందు ఆందోళనకు దిగారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాడైన పదార్థాలను విక్రయించడంతో స్టోర్ సిబ్బందితో కస్టమర్ల గొడవకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 16 May 2023, 10:17 am

ప్రధానాంశాలు:

  • సుచిత్ర రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో ఉద్రిక్తత
  • పాడైన పదార్థాలు విక్రయించారంటూ కస్టమర్ల ఆందోళన
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కస్టమర్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu super market
సూపర్ మార్కెట్
Jeedimetla: జీడిమెట్ల పరిధిలోని సుచిత్రలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ ముందు కస్టమర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. పాడైన పదార్ధాలు విక్రయిస్తున్నారంటూ సిబ్బందితో గొడవకు దిగారు. ఈ సంఘటన సోమవారం రాత్రి సమయంలో చోటుచేసుకుంది. స్టోర్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో చివరకు కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
ఓ కస్టమర్ రత్నదీప్ సూపర్ మార్కెట్‌కి వెళ్లి చికెన్ నగ్గెట్స్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఇంటికెళ్లి వాటిని ఓపెన్ చేసి చూడగా పాడైన వాసన వచ్చాయి. దీంతో ఆగ్రహానికి లోనైన సదరు వ్యక్తి.. వాటిని తీసుకుని వెంటనే రత్నదీప్ స్టోర్‌కి వెళ్లాడు. స్టోర్‌కి వెళ్లి మిగతావి కూడా ఓపెన్ చేసి చూడగా స్టాక్ మొత్తం ఖరాబ్ అయినట్లు గుర్తించాడు. అదే సమయంలో పాడైన నగ్గెట్ ప్యాకెట్లతో మరో ఇద్దరు కస్టమర్స్ కూడా అక్కడికి వచ్చారు. అందరూ కలిసి స్టోర్ సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు.

ఇలా పాడైపోయిన వస్తువులు అమ్మి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ స్టోర్ సిబ్బందిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి సమాధానం చెప్పాలని అడగడంతో.. సుచిత్ర రత్నదీప్ స్టోర్ మేనేజర్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. కస్టమర్స్ గొడవ చేస్తున్నట్లు సమాచారం రావడంతో.. వెంటనే మరో ఏరియా స్టోర్ మేనేజర్ అక్కడకు చేరుకున్నాడు. రేపు మాట్లాడుకుందామంటూ కస్టమర్లకు నచ్చచెప్పాడు. కస్టమర్లను పంపించిన అనంతరం సిబ్బంది వెంటనే స్టోర్ క్లోజ్ చేశారు. దీంతో బాధిత కస్టమర్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.


  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.