యాప్నగరం

వైఎస్ అంటే అభిమానమే.. కానీ.. విజయమ్మకి అసదుద్దీన్ రిప్లై?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభకి విజయమ్మ ఆహ్వానాలు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మంత్రులతో పాటు, సినీ ప్రముఖులని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తారు?

Samayam Telugu 1 Sep 2021, 5:39 pm
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ ఏర్పాటు చేస్తోన్న సంస్మరణ సభ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. వైఎస్ హయాంలో ఆయనతో కలిసి పనిచేసిన నేతలు, అధికారులు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ సన్నిహితులుగా మెలిగిన మాజీ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు ఇతర పార్టీల్లో ఉన్న నేతలను కూడా విజయమ్మ ఆహ్వానించినట్లు చెబుతున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
asad


పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్, సీనియర్ నేత కేకే, అప్పటి అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, సునీతా లక్ష్మా రెడ్డి, తదితరులకు విజయమ్మ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఏపీలోని సీనియర్ నేతలకు కూడా ఫోన్ కాల్స్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

అటు సినీ ప్రముఖులను కూడా సభకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, డైరెక్టర్లు పూరీ జగన్నాధ్, వీవీ వినాయక్‌, దిల్ రాజుకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని కూడా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే విజయమ్మ ఆహ్వానానికి అసద్ నో చెప్పినట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానమే కానీ.. ఆ సభకి రాలేనని సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. తాను సభకు రాలేనని అసద్ వర్తమానం పంపినట్లు చెబుతున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.