MIM: మా పెద్దోళ్లు పాకిస్తాన్ వెళ్లుంటే.. అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మా పెద్దలు పాకిస్తాన్ వెళ్లనందుకు అదృష్టవంతులమంటూ ఎంఐఎం అధినేత అసద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. యూపీ రాజకీయాలతో బిజీగా ఉన్న ఆయన పాక్ మంత్రి రషీద్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
Samayam Telugu 28 Oct 2021, 2:06 pm
ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పాకిస్తాన్ని ఉద్దేశించి మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్ కప్ పోటీల్లో ఇండియాపై పాకిస్తాన్ జట్టు విజయం సాధించడంపై పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించారు. భారత్ జట్టుపై పాక్ విజయాన్ని ఇస్లాం గెలిచిందంటూ పాక్ మంత్రి రషీద్ చేసిన వ్యాఖ్యలపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. పొరుగు దేశం పాకిస్తాన్లో ఓ పిచ్చోడు ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. క్రికెట్ మ్యాచ్కి ఇస్లాంకి ఏం సంబంధమో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఆయనో పిచ్చోడని అన్నారు.
తమ పెద్దోళ్లు పాకిస్తాన్ వెళ్లకపోవడం కూడా మంచిదైందని.. లేకుంటే ఇలాంటి పిచ్చోళ్లని చూడాల్సి వచ్చేదంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ‘‘మా పెద్దలు పాకిస్తాన్ వెళ్లనందుకు అల్లాకు కృతజ్ఞతలు.. లేకపోతే ఈ పిచ్చోళ్లను చూడాల్సి వచ్చేది’’ అని అసద్ అన్నారు. యూపీ రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్న అసద్ ముజఫర్నగర్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా పాక్ మ్యాచ్ అనంతరం ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విజయం చారిత్రకమైనదని ఆయన అభివర్ణించారు.
Also Read:
తమ పెద్దోళ్లు పాకిస్తాన్ వెళ్లకపోవడం కూడా మంచిదైందని.. లేకుంటే ఇలాంటి పిచ్చోళ్లని చూడాల్సి వచ్చేదంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ‘‘మా పెద్దలు పాకిస్తాన్ వెళ్లనందుకు అల్లాకు కృతజ్ఞతలు.. లేకపోతే ఈ పిచ్చోళ్లను చూడాల్సి వచ్చేది’’ అని అసద్ అన్నారు. యూపీ రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్న అసద్ ముజఫర్నగర్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా పాక్ మ్యాచ్ అనంతరం ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విజయం చారిత్రకమైనదని ఆయన అభివర్ణించారు.
Also Read: