యాప్నగరం

షర్మిల పెట్టే పార్టీలోకి మాజీ డీజీపీ! లోటస్ పాండ్‌లో చర్చలు

Lotus Pond: గతంలో మార్చి 23న స్వరణ్ జీత్ సేన్ భార్య అనితా సేన్ వైఎస్ షర్మిలతో లోటస్ పాండ్‌లో భేటీ అయ్యారు. అప్పుడు కూడా చర్చలు జరిపారు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి షర్మిలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Samayam Telugu 6 Apr 2021, 10:00 pm
తెలంగాణలో రాజకీయ ప్రవేశం చేస్తున్న వైఎస్ షర్మిల పెట్టే పార్టీకి మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. ఎక్కువగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పని చేసిన ఉన్నతాధికారులు షర్మిలకు మద్దతు పలుకుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా పని చేసిన స్వరణ్ జీత్ సేన్ షర్మిల పెట్టే పార్టీలోకి చేరేందుకు పావులు కదుపున్నట్టు సమాచారం. ఇందులో బాగంగానే ఆయన మంగళవారం షర్మిలతో లోటస్ పాండ్‌లో భేటి అయ్యారు. షర్మిల పార్టీ పెట్టబోతున్నందున మర్యాదపూర్వకంగా ఆమెతో సమావేశం అయినట్టు స్వరణ్ జీత్ సేన్ స్పష్టం చేశారు. తెలంగాణలో మరో పార్టీ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయని స్వరణ్ జీత్ అన్నారు. వైఎస్ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవం ఉందని.. అవసరమైతే ప్రజలకు సేవ చేసేందుకు షర్మిలతో కలిసి పని చేస్తానని స్వరణ్ జీత్ సేన్ స్పష్టం చేశారు.
Samayam Telugu షర్మిలను కలిసిన మాజీ డీజీపీ దంపతులు
Noel Swaranjit Sen


అయితే, గతంలో మార్చి 23న స్వరణ్ జీత్ సేన్ భార్య అనితా సేన్ వైఎస్ షర్మిలతో లోటస్ పాండ్‌లో భేటీ అయ్యారు. అప్పుడు కూడా చర్చలు జరిపారు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి షర్మిలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

స్వరణ్ జీత్ సేన్ పచ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన వారు. పలు రాయలసీమ జిల్లాలకు గతంలో ఆయన ఎస్పీగా విధులు నిర్వహించారు. అనంతరం వైఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2004 డిసెంబరు 31న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు డీజీపీ ఎంపిక అయ్యారు. రెండు సంవత్సరాల పాటు డీజీపీగా సేవలు అందించి కేంద్ర సర్వీసులకు వెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.