యాప్నగరం

మెదక్: బయటికి వెళ్లిన భర్త.. పక్కింట్లో పడుకున్న భార్య.. ఆ సీన్ చూసి ఉలిక్కిపడిన స్థానికులు

భార్యభర్తల మధ్య మొదలైన చిన్న వివాదం గాలివానలా మారిన రణరంగానికి దారితీసింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరి ఇద్దరూ కత్తులతో దాడికి పాల్పడ్డారు.

Samayam Telugu 19 Jan 2021, 10:46 am
భార్యభర్తల వివాదం చినికిచినికి గాలివానలా మారి కత్తులతో దాడికి దారి తీసిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్‌ మండలంలోని ముప్పిరెడ్డిపల్లిలో సోమవారం జరిగింది. అసోం రాష్ట్రానికి చెందిన అరుణ్, అంజు దంపతులు కొన్నాళ్ల క్రితం ఉపాధి నిమిత్తం ముప్పిరెడ్డిపల్లికి వలస వచ్చారు. వీరికి ముగ్గురు సంతానం. అరుణ్ స్థానికంగా ఓ విత్తన పరిశ్రమంలో హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
Samayam Telugu Image


Also Read: ఐఎంసీ పరీక్ష పేరుతో రూ.16లక్షల స్వాహా... మోసపోయిన హైదరాబాదీ దంపతులు

సోమవారం వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లిన అరుణ్ కాసేపటి తర్వాత ఇంటికొచ్చాడు. ఆ సమయంలో అంజు తమ పోర్షన్‌కు పక్కనే ఖాళీగా ఉన్న గదిలో నిద్రిస్తోంది. అక్కడ ఎందుకు పడుకున్నావంటూ అరుణ్ భార్యను ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. దీంతో భార్యభర్తలిద్దరూ తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. అరుణ్ ఆవేశంలో కత్తితో భార్యను గాయపరచగా.. అంజు కూడా వంటగదిలో నుంచి కత్తి తెచ్చి భర్తను పొడిచింది.

Also Read: హైదరాబాద్‌ వైపు ఒక్కరోజులో 51,650 వాహనాలు... షాకైన హైవే అధికారులు
వీరి గొడవను గమనించిన స్థానికులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దంపతులను నిలువరించారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని 108 అంబులెన్స్‌లో తూఫ్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ గొడవ గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read:మద్యపాన నిషేధం, అన్నింటా ఆదర్శం.. మోట్లతిమ్మాపురం ప్రత్యేకతలివీ..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.