యాప్నగరం

'సీఎం సంజయ్'.. బండికి భారీగా పెరిగిపోయిన క్రేజ్.. అభిమానుల నినాదాలతో ఎమోషనల్

తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్రేజ్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. బీజేపీ శ్రేణులైతే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సీఎం బండి సంజయ్‌ అనే ఫిక్సయిపోయారు. అయితే.. ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించిన వేళ.. బండి సంజయ్‌కి ఉన్న క్రేజ్ బయటపడింది. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన అనంతరం.. బీజేపీ శ్రేణులు చేసిన నినాదాలకు బండి సంజయ్ భావోద్వేగానికి లోనయ్యారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 8 Apr 2023, 4:50 pm

ప్రధానాంశాలు:

  • బండి సంజయ్‌కు పెరిగిపోయిన క్రేజ్
  • సీఎం.. సీఎం.. అంటూ సభలో నినాదాలు
  • అభిమానుల క్రేజ్ చూసి బండి భావోద్వేగం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu cm Sanjay
బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన బండి సంజయ్‌పై అటు బీజేపీ శ్రేణుల్లో... ఇటు అభిమానుల్లో సింపతీ ఓ రేంజ్‌లో పెరిగింది. అయితే.. అది మోదీ పర్యటన వేదికగా బయటపడింది. మోదీ పర్యటన సందర్భంగా.. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించి బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. అయితే.. సభా స్థలికి చేరుకున్న బండి సంజయ్ చూసిన పార్టీ శ్రేణులు.. ఆయనకు గ్రాండ్‌గా వెల్ కం చెప్పారు. దారిపొడవునా ఆయనతో సెల్ఫీలు తీసుకుంటూనే ఉన్నారు. ఇదంతా ఒకఎత్తైతే.. గ్రౌండ్‌లో ఎంటరవగానే.. ఆయనను తమ భుజాలపై ఎత్తుని వేదిక వరకు మోసుకెళ్లి తమ అభిమానాన్ని తెలిపారు కార్యకర్తలు. ఇదిలా ఉంటే.. మోదీ సభ ముగిసిన అనంతరం.. వీవీఐపీ గ్యాలరీ నుంచి బండి సంజయ్ బయటకు వచ్చే సమయంలో.. కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు.
బండి సంజయ్‌ను మళ్లీ తమ భుజాల మీద మోసుకుంటూనే బయటకు తీసుకొచ్చారు. అయితే.. బయటకు తీసుకొస్తున్న సమయంలో.. అభిమానులు ఆసక్తికర నినాదాలు చేశారు. సీఎం సంజయ్.. సీఎం సంజయ్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. తనను దించాలని బండి సంజయ్ కోరినా.. కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోకుండా నినాదాలు చేసుకుంటూ బయటి వరకు మోసుకొచ్చారు. అయితే.. కార్యకర్తలు తనపై చూపిస్తున్న అభిమానానికి బండి సంజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్లు చమర్చాయి.

ఇదిలా ఉంటే.. బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. మోదీ సభకు సీఎం కేసీఆర్‌ రాకపోవటంపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కోసం వేదికపై కుర్చీ వేశామని.. చాలా సేపు ఆయన కోసం ఎదురు చూశామని.. ఆయన వస్తే సన్మానం చేసేందుకు శాలువా కూడా తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తే.. సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదంటూ నిలదీశారు. కేసీఆర్‌కు అంత ముఖ్యమైన పని ఏముందని.. ఆయన ఈరోజు షెడ్యూల్‌ను బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి 24 గంటలూ షాప్‌లు, రెస్టారెంట్లు ఓపెన్
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.