యాప్నగరం

త్వరలోనే కేసీఆర్‌పై దాడులు.. ఆ రోజు త్వరలోనే.. బండి సంజయ్ సంచలనం

Telangana BJP: రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్ రూ.1 కూడా కేటాయించలేదని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ గడీల పాలన అంతం కావాలంటే బీజేపీకి పట్టం గట్టాలన్నారు.

Samayam Telugu 23 Jun 2021, 7:30 pm
‘‘కేసీఆర్‌పై జనం దాడులు చేసే రోజు వస్తుంది. కేసీఆర్‌ నీ పతనం మొదలైంది’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అధినేతపై ఆయన మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధనిక రాష్ట్రం తెలంగాణను అప్పులపాలు చేశారని బండి సంజయ్‌ మరోసారి మండిపడ్డారు. బీజేపీకి భయపడే వాళ్లు గడీల నుంచి బయటకు వస్తున్నారని చెప్పారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kcr on bandi


ఓయూ జేఏసీ విద్యార్థి సురేష్ యాదవ్‌ను బీజేపీ నేత బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బలిదానాలకు తెగించి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన భూమిక పోషించిన విద్యార్థులపై రాక్షస సీఎం డైరెక్షన్‌లో టీఆర్ఎస్ పార్టీ గూండాలు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్ రూ.1 కూడా కేటాయించలేదని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ గడీల పాలన అంతం కావాలంటే బీజేపీకి పట్టం గట్టాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.