యాప్నగరం

డీసీఎం డ్రైవర్‌కు ఫిట్స్.. ప్రాణాలకు తెగించి 16 మందిని కాపాడిన ఎస్సై

హైదరాబాద్‌ బంజారాహిల్స్ ఎస్సై సమయస్ఫూర్తితో 16 మందికి ప్రాణాపాయం తప్పింది. ప్రగతిభవన్ ముట్టడికి వచ్చిన 16 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిని ఓ డీసీఎంలో ఖైరతాబాద్ వైపు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే డ్రైవింగ్ చేస్తున్న హోంగార్డ్‌కు ఒక్కసారిగా ఫిట్స్ రావటంతో.. డీసీఎం అదుపు తప్పి డివైడర్ మీదికి దూసుకెళ్తున్న క్రమంలో.. గమనించిన ఎస్సై ప్రాణాలకు తెగించి డీసీఎంను కంట్రోల్ చేశాడు. దీంతో డీసీఎంలో ఉన్న 16 మందికి ప్రాణాపాయం తప్పినట్టైంది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 21 Mar 2023, 6:59 pm

ప్రధానాంశాలు:

  • ఏబీవీపీ కార్యకర్తలను తరలిస్తోన్న డీసీఎం డ్రైవర్‌కు ఫిట్స్
  • ప్రాణాలకు తెగించి డీసీఎంను కంట్రోల్ చేసిన ఎస్సై
  • 16 మంది ఏబీవీపీ కార్యకర్తలకు తప్పిన ప్రాణాపాయం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu dcm
డీసీఎం
ఖాకీ దుస్తుల్లో కర్కషత్వమే కాదు... ఆపద సమయంలో ఆదుకునే మానవత్వం కూడా ఉంటుందని నిరూపించుకున్నారు పోలీసులు. హైదరాబాద్‌ బంజారాహిల్స్ ఎస్సై.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 16 మంది ప్రాణాలు కాపాడి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రగతి భవన్ వద్ద ముట్టడికి వచ్చిన 16 మంది ఏబీవీపీ కార్యకర్తలని పోలీసులు అరెస్టు చేసి డీసీఎంలో ఖైరతాబాద్ వైపు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో డీసీఎం నడుపుతున్న హోంగార్డు రమేష్‌‌కి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. దీంతో డీసీఎం అదుపుతప్పి డివైడర్ మీదికి దూసుకు వెళ్తున్న సమయంలో బంజారాహిల్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి గమనించాడు. వెంటనే తన వాహనంలో నుంచి కిందికి దూకి.. ప్రాణాలకు తెగించి డీసీఎం వాహనాన్ని కంట్రోల్ చేశాడు. ఎస్సై కరుణాకర్ రెడ్డి సమయస్ఫూర్తితో స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
ఈ క్రమంలో ఎస్సైకి, డీసీఎంలో ఉన్న ఓ కానిస్టేబుల్ సాయికుమార్‌కు గాయాలయ్యాయి. గాయపడిన ఎస్సై కరుణాకర్ రెడ్డి, హోంగార్డు రమేష్‌ను వెంటనే యశోద హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించాడు. ప్రస్తుతం హోంగార్డ్ రమేష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఎస్సై కరుణాకర్ రెడ్డి వాహనాన్ని కంట్రోల్ చేయకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని.. వెంటనే అప్రమత్తమై ప్రమాదం జరగకుండా అందర్నీ కాపాడిన కరుణాకర్ రెడ్డిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రాణాలతో బయటపడ్డ 16 మంది ఏబీవీపీ కార్యకర్తలు కూడా ఎస్సై కరుణాకర్ రెడ్డి చేసిన సాహసానికి ప్రశంసల వర్షం కురిపించారు.

'పాదచారులూ జర జాగ్రత్త..! పరధ్యానంతో ప్రాణాలు పొగొట్టుకోకండి..'
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.