యాప్నగరం

కడుపు నొప్పి వస్తుందంటూ వెళ్లిన క్యాషియర్.. పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టిన బ్యాంకు అధికారులు

హైదరాబాద్ వనస్థలిపురంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో నగదు మాయమైంది. బ్యాంకు క్యాషియర్‌ ప్రవీణే రూ.22.53 లక్షలు తీసుకెళ్లాడని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 11 May 2022, 2:12 pm
ఓ బ్యాంకు క్యాషియర్ చేతివాటం చూపెట్టాడు. బ్యాంకులోని నగదుతో ఎక్కడికో ఉడాయించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంకు క్యాషియర్‌గా పనిచేసే ప్రవీణ్ రూ.22 లక్షలతో పారిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించి వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


నిన్న మధ్యాహ్నం కడుపు నొప్పి వస్తుందని.. హాస్పిటల్‌కు వెళ్లి వస్తానని కొద్దిసేపు పర్మిషన్ కావాలని మేనేజర్‌ను రిక్వెస్ట్ చేశాడు. దీంతో బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్ పర్మిషన్ ఇచ్చారు. బ్యాంకు నుంచి వెళ్లిపోయిన ప్రవీణ్ కుమార్ ఎంతకు తిరిగిరాలేదు. ఈ క్రమంలోనే క్యాష్ బాక్స్‌లో చెక్ చేయగా డబ్బులు లేనట్టుగా మేనేజర్ గుర్తించారు. క్యాషియర్‌ ప్రవీణ్‌ రూ.22.53 లక్షల నగదు తీసుకెళ్లాడని బ్యాంక్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రవీణ్‌ నిన్నటి నుంచి కుటుంబసభ్యులకు కూడా అందుబాటులో లేడు. బ్యాంక్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.