యాప్నగరం

HYD: బెంజ్ కార్ హిట్ అండ్ రన్.. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమం

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. తార్నాకలో ఓ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చి.. రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ కింద పడగా.. ఆయన తలకు తీవ్ర గాయమైంది. మరో ఆటోలోని నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు.. ఈ ఘటన జరిగి 24 గంటలకు గడుస్తున్నా.. పోలీసులు ఆ కారును పట్టుకోకపోవటం గమనార్హం.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 28 Mar 2023, 4:22 pm

ప్రధానాంశాలు:

  • తార్నాకలో హిట్ అండ్ రన్ కేసు
  • రెండు ఆటోలను ఢీకొట్టిన బెంజ్ కారు
  • ఓ ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu hit and run
హిట్ అండ్ రన్
హైదరాబాద్‌లోని తార్నాకలో ఓ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి రెండు ఆటోలను ఢీకొట్టి.. ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. నిన్న(మార్చి 27) ఉదయం సమయంలో ఓ బెంజ్ కారు యజమాని అత్యంత వేగంగా దూసుకొచ్చాడు. ఈ క్రమంలో ఓ ఆటోను కారు బలంగా ఢీకొట్టింది. దీంతో.. ఆటో నడుపుతున్న దశరథ్ (70) అనే డ్రైవర్.. కిందపడ్డాడు. కాగా.. ఆయన తలకు తీవ్రగాయమైంది. అదే సమయంలో దశరథ్ ఆటో ఆ పక్కనే వస్తున్న మరో ఆటోను ఢీకొట్టింది. ఆ ఆటోలో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇం బీభత్సం జరిగినా.. ఆ కారు యజమాని మాత్రం వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హిట్ అండ్ రన్ ప్రమాదంలో.. రెండు ఆటోలు ధ్వంసమయ్యాయి.
గాయపడ్డ ధశరథ్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన తలకు తీవ్రంగా గాయం కావటంతో.. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే.. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు.. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. కాగా.. 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ పోలీసులు ఆ కారును గానీ, డ్రైవర్‌ను కానీ పట్టుకోకపోవటం గమనార్హం. ఇంకా గాలిస్తూనే ఉన్నామని పోలీసులు చెప్తున్నారు.

మరోవైపు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశరథ్‌ది నిరుపేద కుటుంబం కాగా... రోజూ ఆటో నడుపుతూనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ పెద్దకు ఇలా కావటంతో.. కుటుంబసభ్యులకు ఏం చేయాల్లో తొచని పరిస్థితి. ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు బెంజ్ కార్ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని దశరథ్ కుటుంబ సభ్యులు, ఆటో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంజ్ కార్ యజమానిని అరెస్టు చేయాలని, మాకు న్యాయం జరగాలని ఆవేదన వ్యక్తం చేశారు.

వరల్డ్ టూరిస్ట్‌ ప్లేస్‌గా ట్యాంక్‌బండ్.. కిలోమీటర్ పరిధిలోనే 16 పర్యటక ప్రాంతాలు
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.