యాప్నగరం

అఖిలప్రియ కేసులో కీలక పరిణామం.. ఎట్టకేలకు బయటికి..

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో జైలుకెళ్లిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ 18 రోజుల తర్వాత విడుదలయ్యారు. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Samayam Telugu 23 Jan 2021, 7:07 pm
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత భూమా అఖిలప్రియకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. సాక్ష్యులను ప్రభావితం చేస్తారనే కారణంతో రెండుసార్లు బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం.. ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పది వేల రూపాయల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
Samayam Telugu జైలు నుంచి విడుదలైన అఖిలప్రియ.. తరలివచ్చిన అనుచరులు
akhila priya


అఖిలప్రియ విడుదలవుతుండడంతో ఆమె బంధువులు, అనుచరులు జైలు వద్దకు చేరుకున్నారు. హఫీజ్‌పేట్ భూముల వివాదం నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేసిన వ్యవహారంలో ఆమె జైలుపాలయ్యారు. ఈ కేసులో ఆమ ఏ1గా ఉండగా ఏవీ సుబ్బారెడ్డి ఏ2గా, ఆమె భర్త భార్గవ్‌రామ్ ఏ3గా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం భార్గవ్‌రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఆయన ఇంకా పరారీలోనే ఉన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.