యాప్నగరం

అదే జరిగితే ఏడాది సీఎంగానే కేటీఆర్.. బీజేపీ నేత తీవ్ర ఆరోపణలు

Telangana BJP: సీఎంగా కేసీఆర్ అసమర్థుడు కాబట్టే కేటీఆర్‌ను సీఎం చేయాలంటున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ కనుమరుగు కావటం ఖాయమని జోస్యం చెప్పారు.

Samayam Telugu 21 Jan 2021, 3:36 pm
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ కీలక నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాక, కొత్త సీఎం కేటీఆర్ అని వస్తున్న వార్తలపైనా ఆయన స్పందించారు. గురువారం ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఐటీశాక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, నర్సింహా రెడ్డిలతో కలిసి కేటీఆర్ పారిశ్రామిక భూములపై కన్నేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కుటుంబం, మిత్రులు, సన్నిహితుల పరిశ్రమలకే ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని ఆరోపణలు చేశారు. అశోక్ లేలాండ్స్, హైదరాబాద్ డిస్టీలరీ, మోడెర్న్ బేకరీ వంటి సంస్థలను కొన్నది కూడా కేటీఆర్ మిత్రులేనని వ్యాఖ్యానించారు.
Samayam Telugu మాట్లాడుతున్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
nvss prabhakar


సీఎంగా కేసీఆర్ అసమర్థుడు కాబట్టే కేటీఆర్‌ను సీఎం చేయాలంటున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ కనుమరుగు కావటం ఖాయమని జోస్యం చెప్పారు. ఒకవేళ కేటీఆర్‌ను సీఎం చేస్తే ఆయన ఒక ఏడాది సీఎంగానే కేటీఆర్ మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. అంతేకాక, బుధవారం షేక్‌పేట ఎమ్మార్వో కార్యాలయంలోకి చొరబడి తహసీల్దార్‌పై దాడి చేసిన ఎంపీ కే కేశవరావు కుమార్తెపై చర్యలు తీసుకోవాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక కుట్ర దాగి ఉందని.. మియాపూర్ ల్యాండ్ అంశంలో కేకే పాత్ర ఉందని ప్రభాకర్ విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.