మిషన్ తెలంగాణను మొదలు పెట్టింది బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా పార్టీ విస్తరణతో పాటూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కమలదళం సమాయత్తమైంది. నేటి నుంచి హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశాలకు సిద్ధమైంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు.. ఇలా కమలం పార్టీ నేతలంతా భాగ్యనగరానికి క్యూ కట్టారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్లోని మాదాపూర్ హెచ్ఐసీసీ ముస్తాబైంది. గత రెండేళ్లగా కరోనా కారణంగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు భారీగా నిర్వహించలేదు. అందుకే ఈసారి భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. బీజేపీ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుంది. దక్షిణాదిలో కర్ణాటక, పుదుచ్చేరిలలో అధికారంలో ఉంది.. మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. కానీ ఇప్పుడు తెలంగాణలో బలోపేతం అవుతోంది.. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అందుకే తెలంగాణపై కమల దళం ఫోకస్ పెట్టింది. ఆ దిశగానే జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ను వేదికగా ఎంచుకుంది. తమ ఎజెంటాను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయాలని భావిస్తోంది. ఇక్కడా కాషాయ జెండా ఎగరేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్ఎస్కు చెక్ పెట్టి ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది.
అంతేకాదు మరో రెండేళ్లలోగానే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి.. ఈలోపు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే టార్గెట్గా యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ అంశాలపైనా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే తెలంగానలో పార్టీ బలోపేతం, భవిష్యత్లో ఎలా ముందుకు వెళ్లాలో చర్చించనున్నారు. తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడం తమ లక్ష్యమని సంకేతాలు పంపుతోంది. ఎప్పుడూ లేని విధంగా బీజేపీ అగ్ర నేతలు, ముఖ్య నేతలు తెలంగానలోని అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీకి అనుకూలమైన వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు. ఆదివారం సికింద్రాబాద్లో జరిగే భారీ బహిరంగ సభ ద్వారా తమ ఎజెండాను తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశం ఉంది.
హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కాషాయ జెండాల రెపరెపలు కనిపిస్తున్నాయి.. నగరంలో, సమావేశాలు జరిగే ప్రాంతంతోపాటు భారీ హోర్డింగులు, బ్యానర్లు, పోస్టర్లు, జెండాలు దర్శనమిస్తున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యే బీజేపీ ప్రతినిధులకు తెలంగాణ వంటకాలతో ప్రత్యేకంగా ఆతిథ్యం ఇస్తున్నారు. మొత్తానికి ఈ సమావేశాలు తెలంగాణ బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయనే చెప్పాలి.
అంతేకాదు మరో రెండేళ్లలోగానే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి.. ఈలోపు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే టార్గెట్గా యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ అంశాలపైనా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే తెలంగానలో పార్టీ బలోపేతం, భవిష్యత్లో ఎలా ముందుకు వెళ్లాలో చర్చించనున్నారు. తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడం తమ లక్ష్యమని సంకేతాలు పంపుతోంది. ఎప్పుడూ లేని విధంగా బీజేపీ అగ్ర నేతలు, ముఖ్య నేతలు తెలంగానలోని అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీకి అనుకూలమైన వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు. ఆదివారం సికింద్రాబాద్లో జరిగే భారీ బహిరంగ సభ ద్వారా తమ ఎజెండాను తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశం ఉంది.
హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కాషాయ జెండాల రెపరెపలు కనిపిస్తున్నాయి.. నగరంలో, సమావేశాలు జరిగే ప్రాంతంతోపాటు భారీ హోర్డింగులు, బ్యానర్లు, పోస్టర్లు, జెండాలు దర్శనమిస్తున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యే బీజేపీ ప్రతినిధులకు తెలంగాణ వంటకాలతో ప్రత్యేకంగా ఆతిథ్యం ఇస్తున్నారు. మొత్తానికి ఈ సమావేశాలు తెలంగాణ బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయనే చెప్పాలి.