యాప్నగరం

హైదరాబాద్: క్వారీ గుంతల్లో బీటెక్ విద్యార్థుల మృతదేహాలు.. అసలేమైంది?

నగర శివారులో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వారిని ఎవరైనా చంపేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అసలేం జరిగిందనే విషయం విచారణలో తేలాల్సి ఉంది.

Samayam Telugu 11 Mar 2022, 7:42 pm
హైదరాబాద్ నగర శివారులో జంట మృతదేహాలు కనిపించడంతో కలకలం రేగింది. బీటెక్ విద్యార్థులు క్వారీ గుంతల్లో శవమై తేలడం స్థానికంగా అలజడి సృష్టించింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గండిచెరువు గ్రామ శివారులోని క్వారీ గుంతల్లో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతదేహాలు కనిపించాయి. నీళ్లలో ఇద్దరి మృతదేహాలు చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహకారంతో మృతదేహాలను గుంతల్లో నుంచి బయటకు తీశారు. మృతులను నాదర్ గుల్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన క్రాంతి కుమార్ రెడ్డి, శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. వారిది ఆత్మహత్యా? లేక ఎవరైనా హత్య చేసి పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.
Samayam Telugu quary
ప్రతీకాత్మక చిత్రం


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.