యాప్నగరం

పబ్జిగేమ్ కోసం 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

ప్రైవేట్ స్కూల్‌లో మణికంఠ 8వ తరగతి చదువుతున్నాడు. అయితే ఆన్ లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రుల మణికంఠకు సెల్ ఫోన్ కొని ఇచ్చారు. దీంతో ఫోన్‌లో మణికంట పబ్జి గేమ్ ఆడటం ప్రారంభించాడు.

Samayam Telugu 26 Jun 2021, 1:53 pm

ప్రధానాంశాలు:

  • ఆన్ లైన్‌ క్లాసుల కోసం ఫోన్ కొనిచ్చిన పేరంట్స్
  • ఫోన్‌లో పబ్జి ఆడిన మణికంఠ
  • తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
పబ్జి గేమ్ అనేకమంది చిన్నారుల జీవితాల్ని నాశనం చేసింది. ఈ గేమ్‌కు బానిసగా మారి అనేకమంది తల్లిదండ్రులకు తీవ్ర క్షోభకు గురి చేశారు. కొందరు ఈ గేమ్ కోసం ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆన్‌లైన్ క్లాసుల పేరు చెప్పి తల్లిదండ్రుల నుంచి మొబైల్ తీసుకుంటున్న వారిలో కొందరు చిన్నారులు ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడుతున్నారు.
కూకట్ పల్లి లో విషాదం చోటుచేసుకుంది.
ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్జి ఫైర్ గేమ్ కి అలవాటు పడిన మణికంఠ అనే విద్యార్థి ఇవాళ ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ కోసం కుటుంబ సభ్యులు సెల్ ఫోన్ కొనిచ్చారు. ఈ సెల్ ఫోన్ లో పబ్జి ఫైర్ గేమ్ ఆడటం మొదలు పెట్టాడు. గత కొన్నాళ్ల నుంచి కూడా మణికంఠ పబ్జి ఫైల్ గేమ్ కి అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు మణికఠను తీవ్రస్థాయిలో మందలించారు.

చదువు మీద దృష్టి పెట్టారని చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మణికంఠ ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.