యాప్నగరం

సబ్జెక్టులు మిగిలిపోయాయని.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న చందు.. చదువు విషయంలో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. సెకండియర్‌లో రెండు సబ్జెక్టులు ఉండిపోయాయని మనస్తాపంకు గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Samayam Telugu 6 Apr 2021, 10:07 am
మనస్తాపంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. చదువులో వెనకపడుతున్నానని మనస్తాపానికి లోనైన బీటెక్‌ విద్యార్థి ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. క్రిష్ణా జిల్లా, అనిగండ్లపాడు గ్రామానికి చెందిన దాసరి డేవిడ్‌ రాజు నగరానికి వలసవచ్చి ఎల్‌బీనగర్‌ సెంట్రల్‌ బ్యాంకు కాలనీలో ఉంటూ సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు.
Samayam Telugu బీటెక్ విద్యార్థి ఆత్మహత్య


అతని కుమారుడు దాసరి చందు (21) మంగళపల్లిలోని ఏవీఎన్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడికి బీటెక్‌ రెండో సంవత్సరంలో సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఈ విషయమై తరచూ బాధపడేవాడు. ఆదివారం కుటుంబసభ్యులు బయటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న చందు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం చర్చి నుంచి తిరిగి వచ్చిన అతడి తల్లి కిటికీలో నుంచి చూడగా చందు సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.

దీంతో స్థానికులతో కలిసి బలవంతంగా తలుపులు తెరిచి చందును కిందకి దించారు. వెంటనే 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అతడిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి డేవిడ్‌ రాజు ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కన్నబిడ్డ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.