యాప్నగరం

హయాత్ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Samayam Telugu 15 Dec 2020, 12:20 pm
హయత్ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైకోర్టు నిబంధనల్ని అధికారులు బేఖాతరు చేస్తున్నారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్స్ పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. హైకోర్టు రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలో కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్లు మొదలు పడుతున్నారని ఆరోపించారు. హయత్ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీసు ముందు తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.
Samayam Telugu రిజిస్టార్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
hayathnagar sub registor office


Read More: మరో మంత్రికి షాక్.. బీజేపీలో చేరుతున్న సోదరుడు ?

పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తంచేశారు. అయినా కూడా అధికారులు రిజిస్ట్రేషన్లను కొత్త పద్ధతిలో చేయడంతో అక్కడకు రియల్టర్లు,బిల్డర్లు భారీ సంఖ్యలో చేరుకొని ధర్నాలో పాల్గొన్నారు.అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ధర్నాకు దిగిన వారందరిని నచ్చజెప్పే ప్రయత్నం చేసశారు. అయితే ఆందోళనకారులు ఎంతకీ వినకపోవడంతోవారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.