యాప్నగరం

షాద్ నగర్‌లో ఘోరం.. మంటల్లో కాలిపోయిన కారు, గర్భిణి మృతి

షాద్‌నగర్ బైపాస్‌పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని కారు పొదల్లోకి పల్టీ కొట్టింది. పెట్రోల్ లీకై మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.

Samayam Telugu 25 Oct 2021, 10:16 pm
Samayam Telugu కాలిపోతున్న కారు
car burnt
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కారు పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. యాక్సిడెంట్‌తో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో గర్భిణి మృతి చెందింది. షాద్ నగర్ పరిధిలోని జాతీయ రహదారి బైపాస్‌పై నిన్న తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షాద్‌నగర్ వైపు వస్తున్న కారుని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పొదల్లోకి దూసుకెళ్లింది. పెట్రోల్ లీకై మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో శైలజ అనే గర్భిణి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మంటల్లో కారు కాలిపోతున్న వీడియోలు భయానకంగా ఉన్నాయి. మృతురాలి భర్త సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.