యాప్నగరం

జైలు నుంచి అఖిలప్రియ రిలీజ్: వెంటనే చంద్రబాబు ఫోన్, ఏమన్నారంటే..

Bowenpally Kidnap Case: అఖిలప్రియ విడులవుతున్నారని ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి అనుచరులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు భారీగా తరలివచ్చారు. వారి రాకతో జైలు పరిసరాల్లో సందడి నెలకొంది.

Samayam Telugu 23 Jan 2021, 11:10 pm
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఎట్టకేలకు శనివారం బెయిల్‌పై విడుదలయ్యారు. 18 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. శనివారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి భారీ ఎత్తున మద్దతుదారులు, అనుచరుల హడావుడి, నినాదాల మధ్య ఆమె విడుదలయ్యారు. అఖిలప్రియ విడులవుతున్నారని ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి అనుచరులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు భారీగా తరలివచ్చారు. వారి రాకతో జైలు పరిసరాల్లో సందడి నెలకొంది.
Samayam Telugu అఖిలప్రియ, చంద్రబాబు (ఫైల్ ఫోటోలు)
Akhila priya tdp


అఖిలప్రియ శనివారం సాయంత్రం విడుదల కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని, ఎన్ని కష్టాలు వచ్చినా నిబ్బరంతో మెలగాలని సూచించినట్లు సమాచారం. అంతేకాకుండా, తోటి వారికి కూడా ధైర్యం చెప్పాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.

జనవరి 5న హైదరాబాద్ బోయిన్‌పల్లిలో ప్రవీణ్ రావు సోదరులను భూమా అఖిలప్రియ అనుచరులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జనవరి 6న భూమా అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హఫీజ్‌పేట్‌లోని 48 ఎకరాల భూమి వ్యవహారంలో ప్రవీణ్ రావు ఫ్యామిలీకి, అఖిలప్రియ ఫ్యామిలీకి తగాదాలు ఉన్నాయి. భూమా అఖిలప్రియ వారిని కిడ్నాప్ చేయించారనేది ఆరోపణ. అరెస్టయిన నాటి నుంచి అఖిలప్రియ రిమాండ్‌లోనే ఉన్నారు. కోర్టు 3 రోజుల కస్టడీకి అప్పగించడంతో పోలీసులు ఆమె‌ను విచారణ జరిపారు. కిడ్నాప్ కేసుకు సంబంధించి కీలక వివరాలను రాబట్టారు. అఖిలప్రియ ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో ఇప్పటి వరకు అఖిలప్రియతో కలిపి మొత్తం 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్‌ రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్‌ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.