నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) అధికారులు ఇటీవల ఉక్కుపాదం మోపుతున్నారు. తాము స్వయంగా తనిఖీలు చేయడంతో పాటు సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫిర్యాదులకు కూడా స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో హలీమ్, బిర్యానీకి ప్రసిద్ధి చెందిన పిస్తా హౌస్ రెస్టారెంట్కు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దిమ్మతిరిగే షాకిచ్చింది. చార్మినార్లోని పిస్తాహౌస్ నిర్వాహకులు రెస్టారెంట్ ముందుకు జిగేల్ మనేలా విద్యుద్దీపాల బోర్డును ఏర్పాటుచేశారు. ఈ లైట్లు ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే వారి కళ్లను బైర్లు కమ్మేలా చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో మంగళవారం పిస్తా హౌస్ను పరిశీలించిన అధికారులు రూ.50వేల జరిమానా విధించారు.
దీంతో పాటు మంగళవారం పలు ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలను పరిశీలించిన అధికారులు కొన్నింటికి భారీస్థాయిలో జరిమానాలు విధించారు. భవన సముదాయంపై ప్రకటన బోర్డు ఏర్పాటు చేసుకున్నందుకు నాగోల్లోని శ్రీనివాస ఫర్నిచర్స్కు రూ.లక్ష, అల్కాపురి ఎక్స్రోడ్డులోని లక్కీ రెస్టారెంట్కు రూ.1.5లక్షల జరిమానా విధిస్తూ జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ట్విటర్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
దీంతో పాటు మంగళవారం పలు ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలను పరిశీలించిన అధికారులు కొన్నింటికి భారీస్థాయిలో జరిమానాలు విధించారు. భవన సముదాయంపై ప్రకటన బోర్డు ఏర్పాటు చేసుకున్నందుకు నాగోల్లోని శ్రీనివాస ఫర్నిచర్స్కు రూ.లక్ష, అల్కాపురి ఎక్స్రోడ్డులోని లక్కీ రెస్టారెంట్కు రూ.1.5లక్షల జరిమానా విధిస్తూ జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ట్విటర్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.