యాప్నగరం

Alert: మకాం మార్చిన చిరుత.. శంషాబాద్‌ను వదిలి అటువైపు..

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ గోడదూకి వెళ్లిపోయిన చిరుత మొబైల్ పార్టీ పోలీసులకు కనిపించడంతో అలజడి రేగింది. చిరుత మకాం మార్చిందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Samayam Telugu 19 Jan 2021, 6:00 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
leopard
మూణ్నెల్లుగా అధికారులతో మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న చిరుత మకాం మార్చినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ.. అధికారులతో దాగుడు మూతలు ఆడిన చిరుత అక్కడి నుంచి మరోచోటకు వెళ్లిపోయినట్లుగా భావిస్తున్నారు. గత ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రహరీగోడ దూకి చిరుత పరారైన దృశ్యాలు సీసీటీవీ రికార్డుల్లో కనిపించాయి. తన మకాం మార్చి సోమవారం రాత్రి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి, జల్ పల్లి, కార్గో రోడ్డు పరిసర ప్రాంతాల్లో కనిపించింది.

చిరుత సంచరిస్తున్నట్లుగా గ్రామస్తులు సమాచారం అందించడంతో పహాడీషరీఫ్ పోలీసులు ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గత రాత్రి విధులు నిర్వహిస్తున్న పహడీషరీఫ్ మొబైల్ పోలీసులకు మామిడిపల్లి గ్రామ సమీపంలో కార్గో రోడ్డుపైన చిరుత కనిపించడంతో అలజడి రేగింది. ఈ మేరకు అప్రమత్తమైన పహాడీషరీఫ్ పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.