యాప్నగరం

HYD: టీఆర్‌ఎస్, ఎంఐఎం డిష్యుం డిష్యుం.. చొక్కాలు పట్టుకుని.. ఓ రేంజ్‌లో!!

భాగ్యనగరంలో ఇరుపార్టీల నేతల నడుమ తలెత్తిన వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఎంఐఎం, టీఆర్‌ఎస్ నేతలు బాహాబాహీకి దిగారు. ఎంఐఎం నేతలు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారని టీఆర్ఎస్ నేతలు రావడంతో విషయం సీరియస్ అయింది.

Samayam Telugu 13 Aug 2021, 6:45 pm
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌లో అధికార టీఆర్ఎస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ భవన నిర్మాణ విషయమై ఇరుపార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. చొక్కాలు పట్టుకుని చితకబాదుకునేందుకు సిద్ధమయ్యారు. కొద్దిసేపు వీరంగం సృష్టించారు. రాజేంద్రనగర్‌లో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. యాజమాని అనుమతులు లేకుండా అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నాడని ఎంఐఎం నేతలు నిర్మాణ పనులను అడ్డుకోవడంతో వివాదం రేగింది. టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగడంతో ఘర్షణకు దారితీసింది. నేతలు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డాడు. చొక్కాలు పట్టుకుని కొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘర్షణకు దిగిన నేతలను పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు సమాచారం.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
trs mim


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.