యాప్నగరం

HYD: వినాయక చవితి వేడుకల్లో హింస.. ఘర్షణలో ఒకరి మృతి

వినాయక చవితి ఉత్సవాల్లో అపశ్రుతి. ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో పరస్పర దాడులు. తీవ్రగాయాలవడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. శామీర్‌పేటలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 11 Sep 2021, 6:34 pm
వినాయక చవితి వేడుకల్లో హింస చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ దారుణానికి దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరు మృతి చెందారు. శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట్ ఏరియా విమలా ఫీడ్స్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణ చెలరేగడంతో బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని లక్ష్మీనారాయణ్(52)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మేడ్చల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.